సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా? తనంతట తానే ప్రజావ్యతిరేకతను కొని తెచ్చుకుంటున్నారా? అవును.. ఇప్పుడు ఇదే అంశం ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన [more]

Update: 2019-08-04 13:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా? తనంతట తానే ప్రజావ్యతిరేకతను కొని తెచ్చుకుంటున్నారా? అవును.. ఇప్పుడు ఇదే అంశం ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన చర్చగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును పదే పదే కలవడం, గోదావరి నది జలాల మళ్లింపుపై చర్చలు జరుపుతుండటాన్ని ప్రతిపక్ష పార్టీలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఈ ఇద్దరి కలయికపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున విమర్శలు విన్పిస్తున్నాయి.

కేసీఆర్ తో వరస భేటీలు….

ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు సిద్ధమవుతోంది. గోదావరి నదీ జలాలపై పూర్తి అధికారాన్ని కేసీఆర్ కు కట్టబెడుతున్నారన్నది ప్రధాన ఆరోపణ. గోదావరి నదిపై తెలంగాణలో నిర్మించే ఆనకట్టలు భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు మరింత పెంచుతాయని టీడీపీ ఇప్పటికే వైఎస్ జగన్ పై విరుచుకుపడుతోంది. కోట్లాది రూపాయల ఆంధ్రప్రజల డబ్బుతో కేసీఆర్ అక్కడ ఆనకట్టలు నిర్మించుకుని తాను లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారని, వైఎస్ జగన్ ఆయన ట్రాప్ లో పడ్డారన్నది తెలుగుదేశం పార్టీ అభియోగం.

బందరు పోర్టుపైనా….

ఇక బందరు పోర్టుపై కూడా తెలుగుదేశం ఇదే రకమైన ప్రచారం చేస్తోంది. బందరు పోర్టును వైఎస్ జగన్ తెలంగాణకు అమ్మేశారని, రహస్య జీవో విడుదల చేశారని తెలుగుదేశం ఆరోపిస్తుంది. ఆ జీవోను బయటపెట్టాలని టీడీపీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. అయితే దీనిపై వైసీపీ నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం కొంత అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబు ఆయన తనయుడు బందరుపోర్టుపై చేస్తున్న ప్రచారాన్ని వైసీపీ సమర్థవంతంగా ఎదుర్కొన లేకపోయింది.

లెక్క చేయని జగన్…..

అయితే వైఎస్ జగన్ వీటన్నింటీ లెక్క చేయడం లేదు. గత ఎన్నికల ప్రచారంలో సయితం చంద్రబాబు తనకు, కేసీఆర్ ల మధ్య ఉన్న సంబంధాలను విస్తృతంగా ప్రచారం చేశారని, కేసీఆర్ తనకు ఎన్నికల ఖర్చు కింద వెయ్యికోట్లు ఇచ్చారని చెప్పినా జనం నమ్మలేదని వైఎస్ జగన్ పార్టీ అంటోంది. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నది వైసీపీ అభిప్రాయం. ప్రజలు భవిష్యత్తులో తమ ప్రయత్నాలను అర్థం చేసుకుంటారని వారు నమ్ముతున్నారు. అయితే జగన్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం.

Tags:    

Similar News