జగన్ ను ఆపేవారు లేరా?

అవును పార్టీలో ఇదే చర్చ జరుగుతుంది. వరస ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఏ ఎన్నికైనా అదే రిజల్ట్ తప్పదని పదే పదే ప్రత్యర్థి పార్టీలకు [more]

Update: 2021-04-05 02:00 GMT

అవును పార్టీలో ఇదే చర్చ జరుగుతుంది. వరస ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఏ ఎన్నికైనా అదే రిజల్ట్ తప్పదని పదే పదే ప్రత్యర్థి పార్టీలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ప్రత్యర్థి పార్టీల సంగతి కొంత పక్కన పెడితే సొంత పార్టీ నేతలకే ఈ రిజల్ట్ ఎసరు పెట్టేలా ఉందన్న చర్చ నడుస్తుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికలో 151 స్థానాలు, పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం, మున్సిపాలీటీల్లో 99 శాతం, కార్పొరేషన్లలో వంద శాతం ఫలితం. ఇది వైసీపీ రిజల్ట్ ఛార్ట్.

రఫ్ఫాడించడమే…..

దీంతో వైఎస్ జగన్ ఇక పార్టీ నేతలను కూడా రఫ్ఫాడించే కార్యక్రమం చేపడతారన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి. అక్కడక్కడ నియోజకవర్గాల్లో తలెత్తిన అసంతృప్తులు ఇంకా కొనసాగుతున్నాయి. అనేక నియోజకవర్గాల్లో వైసీపీలో రెండు గ్రూపులుగా విడిపోయాయి. ఇప్పటి వరకూ వీటిపై మౌనంగా ఉన్నట్లు కన్పించినా త్వరలోనే ఈ నియోజకవర్గాల విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

నిష్కర్ష నిర్ణయాల వైపే….

తీసుకునే నిర్ణయం కూడా నిష్కర్షగా కఠినంగా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుందని, మిగిలిన వారు ఇష్టం లేకుంటే పార్టీని వీడి వెళ్లవచ్చన్న సంకేతాలు కూడా జగన్ త్వరలో ఇవ్వనున్నారని చెబుతున్నారు. ఇక నిన్న మొన్నటి వరకూ మంత్రి వర్గ విస్తరణలో పెద్దగా మార్పులేవీ ఉండవని భావించారు. అయితే జగన్ మాత్రం పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసేందుకు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

సీనియర్లను గౌరవంగా…..

ప్రధానంగా సీనియర్ మంత్రులు కొందరు తమ పదవికి ధీమా ఉండదని భావిస్తున్నారు. కానీ మున్సిపాలిటీ, కార్పొరేషన్ ల మేయర్ ఎంపికలోనే జగన్ వారికి శాంపిల్ చూపారంటున్నారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, మరోసారి మరొకరికి అవకాశం ఇవ్వాలని నాడే చెప్పానని, అందుకే గౌరవంగా తప్పుకోవాలని జగన్ స్వయంగా కొందరు సీనియర్ మంత్రులకు సూచించే అవకాశాలున్నాయంటున్నారు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్ తో టీడీపీ సంగతి ఎలా ఉన్నా సొంత పార్టీ నేతలు మాత్రం ఈ రిజల్ట్ ఎందుకొచ్చాయిరా బాబూ? అంటూ తలలు పట్టుకుంటున్నారట.

Tags:    

Similar News