నిస్సహాయతలో జగన్.. ప్రత్యామ్నాయ మార్గాలే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఇబ్బందిగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ విషయంలో తాము ముందుకు పోవడానికి సిద్ధమయింది. మరో [more]

Update: 2021-03-22 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఇబ్బందిగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ విషయంలో తాము ముందుకు పోవడానికి సిద్ధమయింది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఊపందుకుంటోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ అడుగులు ఎటువైపు అన్న చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది. ఒకవేళ ప్రయివేటీకరణ విషయంలో ఫెయిలయితే మాత్రం జగన్ కు భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవు.

విపక్షాల విమర్శలకు….

ఇప్పటికే విపక్షాలు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ ను తప్పుపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ముందుగానే జగన్ కు చెప్పి స్టీల్ ప్లాంట్ ను అమ్మకానికి పెట్టిందన్న ఆరోపణలు చేస్తున్నాయి. కేవలం ప్రధాని మోదీకి లేఖలు రాసినంత మాత్రాన సరిపోదని, కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తేవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంపై జగన్ ఎలా వత్తిడి తీసుకు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

వత్తిడి తెచ్చే పరిస్థితుల్లో…..

నిజానికి కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి చేసే పరిస్థితుల్లో జగన్ లేరు. బీజేపీ కేంద్రంలో బలంగా ఉండటం, వైసీపీ సహకారం ఇప్పట్లో అవసరం ఏమీ లేకపోవడంతో జగన్ నిస్సహాయ స్థితిలోనే ఉన్నారు. బెదిరింపులకు దిగితే కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందన్న నమ్మకం లేదు. మూడు సాగు చట్టాలకు నిరసనగా నెలల తరబడి రైతులు ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో చేస్తున్నా మోదీ ప్రభుత్వం దిగిరాలేదు. అలాంటిది స్టీల్ ప్లాంట్ విషయంలో వెనకడుగు వేస్తుందన్న నమ్మకం లేదు.

బతిమాలుకోవడం మినహా…..

దీంతో జగన్ కేంద్ర ప్రభుత్వం ను బతిమాలుకోవడం మినహా మరేం చేయలేని పరిస్థితి ఉంది. అయితే ప్రత్యామ్నాయ మార్గాలను జగన్ దీనిపై అన్వేషిస్తున్నారని చెబుతున్నారు. ప్రయివేటు పరం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై నిపుణుల అభిప్రాయం సేకరిస్తున్నారు. ఇది ఎంతవరకూ సాధ్యమన్నది ఇంకా తేలకున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులు ఇబ్బందిపడకుండా నిర్ణయం తీసుకోవాలన్నది జగన్ ఆలోచన. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News