కిల్ చేసి మంచి పనిచేశారా?

రాష్ట్ర విభజన తర్వాత ప్రాంతీయ పార్టీలు ఒక్క ప్రాంతానికే పరిమితమయ్యాయి. బీహార్ లో లాలూప్రసాద్ యాదవ్ పార్టీ జార్ఖండ్ లో ప్రభావం చూపలేకపోయింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీఎస్పీ, [more]

Update: 2021-02-21 11:00 GMT

రాష్ట్ర విభజన తర్వాత ప్రాంతీయ పార్టీలు ఒక్క ప్రాంతానికే పరిమితమయ్యాయి. బీహార్ లో లాలూప్రసాద్ యాదవ్ పార్టీ జార్ఖండ్ లో ప్రభావం చూపలేకపోయింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీలు ఏమాత్రం సక్సెస్ సాధించలేకపోయాయి. ఇక తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించినా తెలంగాణలో మాత్రం పూర్తిగా పడకేసింది. వైసీపీది కూడా అదే పరిస్థితి.

రాష్ట్రం విడిపోగానే…?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓటు బ్యాంకు పటిష్టంగా ఉన్న వైసీపీ, టీడీపీలు రాష్ట్రం విడిపోగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమయ్యాయి. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. రెండు రాష్ట్రాలకు సంబంధించి సమస్యలు ఉండటంతో వాటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా వైసీీపీ, టీడీపీలకు ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు మాత్రం టీడీపీకి అక్కడ బలంలేకపోయినా అలాగే కొనసాగిస్తున్నారు.

2014 తర్వాత నుంచి….

కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం తెలంగాణలోపార్టీని పూర్తిగా పక్కన పెట్టేసినట్లే. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ తెలంగాణ వైసీపీ యాక్టివిటీస్ ను పూర్తిగా అటకెక్కించారు. పూర్తిగా ఏపీ రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. అనుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ వైసీపీ జోలికి వెళ్లలేదు. ఏపీలో అధికారంలోకి రావడంతో తెలంగాణ వైసీపీ నేతలు అనేక మంది ఇక్కడ జరుగుతున్న ఎన్నికలలో పోటీ చేేసేందుకు ఆసక్తి కనపర్చారు. కానీ జగన్ నో చెబుతూ వస్తున్నారు.

అందుకే షర్మిల పార్టీ…..

రెండు రాష్ట్రాల్లో ఒకే పార్టీ మనుగడ సాధించలేదన్నది జగన్ నమ్మకం. అందుకే వైఎస్ షర్మిలతో కొత్త పార్టీ పెట్టిస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతుంది. సరే.. ఎవరు ఈ పార్టీ వెనక ఉన్నారన్నది పక్కన పెడితే పార్టీ క్యాడర్ ను, నేతలను కాపాడుకోవడానికి షర్మిల రూపంలో ఒక పార్టీ తెలంగాణలో ముందుకు వస్తుంది. దీనివల్ల వైఎస్ అభిమానుల్లో కొత్త జోష్ నింపుతుంది. అధికారం లోకి షర్మిల కొత్త పార్టీ వచ్చినా రాకపోయినా, వైసీపీని అక్కడ కిల్ చేయడమే జగన్ తీసుకున్న మంచి నిర్ణయమని పార్టీలో అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News