ఆ తర్వాతే…టీడీపీ కి ఇబ్బందులట…జగన్ వ్యూహమదేనట

పంచాయతీ ఎన్నికలు జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొద్ది కాలం తర్వాత జరపాలని భావించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపారు. అయితే [more]

Update: 2021-02-19 13:30 GMT

పంచాయతీ ఎన్నికలు జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొద్ది కాలం తర్వాత జరపాలని భావించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపారు. అయితే జగన్ ఎక్కువ సంఖ్యలో పంచాయతీలను ఏకగ్రీవం చేయాలనుకున్నారు. వీటికి నగదు పురస్కారాన్ని కూడా బాగా పెంచారు. అయితే టీడీపీ నేతలు నామినేషన్లు వేసేందుకే మొగ్గు చూపడంతో ఏకగ్రీవాలు పెద్దగా జరగలేదు. ఎన్నికల్లో తనకు అనుకూలంగానే ఫలితాలొస్తాయని జగన్ నమ్మారు.

టీడీపీని కట్టడి చేయడానికి…..

అయితే టీడీపీ నేతలను కట్టడి చేయడానికి జగన్ రచించిన వ్యూహం ఫలించిందనే చెప్పాలి. దూకుడు మీద ఉన్న టీడీపీ నేతలకు కళ్లెం వేసే దిశగా వైసీపీ ప్రయత్నించింది. ఇందులో భాగంగానే అచ్చెన్నాయుడు అరెస్ట్. ఆయన బెయిల్ పై తర్వాత బయటకు వచ్చినా దాదాపు వారం రోజులు జైలులోనే ఉండిపోయారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడిని నామినేషన్ వేయకుండా బెదిరించారన్న ఆరోపణలపై అరెస్ట్ చేశారు.

రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడి అరెస్ట్ తో….

అచ్చెన్నాయుడు అరెస్ట్ టీడీపీ నేతలపై బాగానే పనిచేసిందనే చెప్పాలి. ఎక్కడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇన్ ఛార్జులు పంచాయతీ ఎన్నికలలో దూకుడు తగ్గించారు. అచ్చెన్న అరెస్ట్ తర్వాత పూర్తిగా పంచాయతీ ఎన్నికలకు దూరమయ్యారనే చెప్పాలి. మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పై కూడా ఇదే తరహా కేసు నమోదయింది. ఇలా పంచాయతీ ఎన్నికల వేళ కీలక నేతలపై కేసులు నమోదుకావడంతో మిగిలిన ప్రాంతాలపై ఆ ఎఫెక్ట్ పడిందంటున్నారు. దీంతో వైసీపీ నేతలు ఓటింగ్ సమయంలో తమ పని కానిచ్చేసుకున్నారంటున్నారు.

టీడీపీ నేతలు డీలా….

అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారంపై చంద్రబాబు సయితం పెద్దగా స్పందించలేదు. వారం రోజుల పాటు జైలులో ఉన్నా అచ్చెన్నాయుడు ను కీలక నేతలు ఎవరూ పరామర్శించలేదు. ఇలా జగన్ రూపొందించిన అచ్చెన్న అరెస్ట్ వ్యూహం టీడీపీ నేతల్లో బాగా పనిచేసింది. దాని కారణంగానే అనేక జిల్లాల్లో నామినేషన్లు వేసినా కొందరు ప్రచారం కూడా చేయలేదంటున్నారు. ఇలా వైసీపీ పంచాయతీ ఎన్నికలకు ముందు జగన్ అనుసరించిన వ్యూహాలే ఆ పార్టీని గట్టెక్కించాయి. టీడీపీని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి.

Tags:    

Similar News