అంతా అనుకున్నట్లుగానే?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ‘మేఘా’ పోలవరంగా మారింది. గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే తక్కువకు శాతంకు -12.6% అంటే 4358 మొత్తానికి పనులు చేపట్టేందుకు మేఘా [more]

Update: 2019-09-23 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ‘మేఘా’ పోలవరంగా మారింది. గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే తక్కువకు శాతంకు -12.6% అంటే 4358 మొత్తానికి పనులు చేపట్టేందుకు మేఘా సంస్థ ముందుకొచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి 628కోట్ల మొత్తం నిధుల ఆదా అవుతాయి.ఈ ప్రాజెక్ట్ లో జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా ఆ పనికి మేఘా ఇంజనీరింగ్ ఒక్కటే 4358 మొత్తానికి టెండర్ దాఖలు చేసింది. కోర్టు అనుమతులు లభించిన వెంటనే పనులు మేఘా ఇంజినీరింగ్ సంస్థ పనులను ప్రారంభించనుంది.

628 కోట్ల ఆదా …

రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌లో భాగంగా పోలవరం కాంట్రాక్టును రద్దు చేసి తిరిగి టెండర్‌ను పిలిచింది. దేశంలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఎల్-1గా వచ్చిన సంస్థ కోట్ చేసిన ధరను ప్రాథమిక అంచనా వ్యయాంగా పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగా బిడ్డింగ్ నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పనులను రద్దు చేసి రివర్స్ టెండర్ కు వెళ్లి, పోలవరం హెడ్ వర్క్స్ తో పాటు జల విద్యుత్ కేంద్రాలను కలిపి ప్రభుత్వం రివర్స్ టెండర్ పిలిచింది. ఆ పనులు విలువ రూ 4987 కోట్లు.

ఒక్కటే దాఖలు చేయడతంతో….

ఈ పనులకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఒక్కటే బిడ్ దాఖులు చేసింది. ఇప్పటికే రికార్డు సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని పూర్తి చేయటంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ నిర్మించింది. పోలవరం బిడ్ ప్రభుత్వం ఓపెన్ చేసింది. అవసరమైన ప్రక్రియను పూర్తిచేసిన వెంటనే నిర్మాణ పనులు చేపట్టేందుకు మేఘా ఇంజనీరింగ్ సిద్ధమౌతోంది. ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా ఈ బహుళార్ధ సాధక ప్రాజెక్టును పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో మేఘా ఇంజనీరింగ్ ఉంది. మొత్తం మీద పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు జగన్ ప్రభుత్వం సిద్దమయింది.

Tags:    

Similar News