అలా అయితేనే ఇద్దరికీ చెక్

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ చేరికలకు ద్వారాలు తెరవడం వెనక అసలు వ్యూహం బీజేపీని బలపడకుండా చేసేందుకేనంటున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన నాలుగు నెలల వరకూ పార్టీని [more]

Update: 2019-10-14 13:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ చేరికలకు ద్వారాలు తెరవడం వెనక అసలు వ్యూహం బీజేపీని బలపడకుండా చేసేందుకేనంటున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన నాలుగు నెలల వరకూ పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీ కూడా ఓటమితో పూర్తిగా నిర్వీర్యమైంది. దీంతో ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇక జనసేన కూడా గత ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ కావడంతో ఆ పార్టీ నేతలు కూడా ఇక ఇక్కడ ఉండి లాభం లేదనకుని ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.

ఇతర పార్టీల నేతలను…

కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఇతర పార్టీల నేతలను చేర్చుకునే అవసరం లేదని తొలుత భావించారు. తమ పార్టీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో బలంగా ఉండటంతో పాటు నియోజకవర్గానికి ఇద్దరు బలమైన నేతలు ఉండటం కూడా జగన్ చేరికలకు గ్రీన్ సిగ్నల్ మొన్నటి వరకూ ఇవ్వకపోవడానికి ఒక కారణంగా చూడాలి. అయితే వైసీపీలో ఎంట్రీ లేకపోవడంతో జనసేన, టీడీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆ పార్టీలో చేరితే కొంతలో కొంత స్థానికంగా బలంగా ఉండవచ్చని భావించి బీజేపీని ఎంచుకున్నారు.

బీజేపీ బలపడుతుందని…..

దీంతో ఏపీలో బీజేపీ బలపడే సూచనలు కన్పిస్తున్నాయి. అప్పటికే బలమైన నేతలు కొందరు బీజేపీ వైపు వెళ్లిపోయారు. చూస్తూ ఊరుకుంటే బీజేపీ బలపడటమే కాకుండా ఎన్నికల సమయానికి టీడీపీ కూడా పుంజుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే జగన్ చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. తోట త్రిమూర్తులు తొలుత వైసీపీలో చేరాలనుకుని అక్కడ వీలు కాదని తెలియడంతో బీజేపీ వైపు చూశారు. ఈ సంగతి తెలిసిన వైసీపీ అధినాయకత్వం తోట త్రిమూర్తులు చేరికకు ఓకే చెప్పిందంటారు. బలమైన నేత కావడంతో తోట ఫ్యూచర్ లో పనికొస్తారని జగన్ భావించారు.

నియోజకవర్గాలు పెరిగే…..

అలాగే నేతల వల్ల పెద్దగా ఉపయోగం లేకున్నా వారిని కూడా చేర్చుకునేందుకు జగన్ రెడీ అయ్యారు. ఇందుకు కారణాలు కూడా ప్రతిపక్షాలను మరింతగా బలహీన పర్చాలన్నదే. తెలుగుదేశం పార్టీ ఎన్నికల నాటికి మళ్లీ కొంత పుంజుకుంటుందన్నది జగన్ కు తెలియంది కాదు. తన పార్టీలో ఉంటే ఆపార్టీలోకి వెళ్లేందుకు నేతలు ఇష్టపడరు. అంతేకాకుండా నియోజకవర్గాల సంఖ్యకూడా పెరిగే అవకాశమున్నందున చేరికలతో నష్టం లేదని జగన్ అభిప్రాయపడినట్లు తెలిసింది. బీజేపీ బలోపేతం కాకుండా చూడటం, టీడీపీని ఖాళీ చేయడమే లక్ష్యంగా జగన్ చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

Tags:    

Similar News