కాంగ్రెస్ కన్నెర్న చేస్తే ఖతం కావా థాక్రే?

రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు మరొక రాష్ట్రంలో సహకరించుకోవు. ఇది పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో స్పష్టమవుతుంది. మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే [more]

Update: 2021-03-18 18:29 GMT

రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు మరొక రాష్ట్రంలో సహకరించుకోవు. ఇది పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో స్పష్టమవుతుంది. మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే ఉన్నారంటే అందుకు కారణం కాంగ్రెస్ సహకరించడమే. అయినా సరే ఉద్ధవ్ థాక్రే మాత్రం కాంగ్రెస్ కంటే తృణమూల్ కాంగ్రెస్ ముద్దయింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికకల్లో శివసేన టీఎంసీకి మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

సోనియాను కలసి…..

మహారాష్ట్రలో బీజేపీతో స్నేహం చెడిన తర్వాత హుటాహుటిన ఉద్ధవ్ థాక్రే టెన్ జన పథ్ కు బయలుదేరి వెళ్లారు. కుమారుడితో కలసి సోనియా గాంధీ ఆశీస్సులు తీసుకున్నారు. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా ప్రధాన కారణమనే చెప్పాలి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తూ, తమకు తాము పరిమితులు విధించుకోవడం వల్లనే మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం సజావుగా నడుస్తుంది.

బెంగాల్ లో మమతకు మద్దతు….

అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో శివసేన పోటీ చేయాలని తొలుత భావించింది. ఇందుకోసం ఒక కమిటీని ఉద్ధవ్ థాక్రే నియమించారు. కమిటీ పశ్చిమ బెంగాల్ లో పర్యటించి శివసేనకు అనుకూలమైన నియోజకవర్గాల జాబితాను కూడా ఇచ్చారు. కానీ చివరిక్షణంలో ఉద్ధవ్ థాక్రే మనసు మార్చుకున్నారు. బీజేపీని అధికారంలోకి రానివ్వకూడదని మమతకు ఉద్దవ్ థాక్రే మద్దతు ప్రకటించారు.

గెలవలేదని..అందుకేనంటూ…..

పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. కమ్యునిస్టులతో కలసి కూటమిగా ఏర్పడి బరిలోకి దిగింది. కాంగ్రెస్ దాదాపు 92 స్థానాల్లో పోటీచేస్తుంది. అయితే పశ్చిమ బెంగాల్ లో శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ టీఎంసీతో పొత్తు పెట్టుకుంది. శివసేన మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ ఒంటరి అయింది. కాంగ్రెస్ గెలవడం కష్టం కాబట్టే తాము మమతకు మద్దతు ప్రకటించామని వీరు చెబుతున్నప్పటికీ మహారాష్ట్రలో కాంగ్రెస్ సహకారం లేకపోతే ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ఎక్కడన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మొత్తం మీద మిత్రులుగా ఉంటేనే పక్క రాష్ట్రంలో శత్రువులుగా మారుతుండటం పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కన్పిస్తుంది.

Tags:    

Similar News