తోట వైపే మొగ్గు చూపుతారా?

తూర్పు గోదావ‌రి జిల్లా వైసీపీలో నియోజ‌క‌వ‌ర్గానికి ఒక విధంగా రాజ‌కీయాలు మారుతున్నాయి. కొన్ని నియో జ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు అంటీముట్టన‌ట్టు ఉంటే.. మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు అతిగా ఉంటున్నారు. [more]

Update: 2020-02-27 03:30 GMT

తూర్పు గోదావ‌రి జిల్లా వైసీపీలో నియోజ‌క‌వ‌ర్గానికి ఒక విధంగా రాజ‌కీయాలు మారుతున్నాయి. కొన్ని నియో జ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు అంటీముట్టన‌ట్టు ఉంటే.. మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు అతిగా ఉంటున్నారు. ముఖ్యంగా రామ‌చంద్రాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి 4 సార్లు గెలిచిన తోట త్రిమూర్తుల‌కు, గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మ‌ధ్య ఇప్పుడు ప‌చ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది.

అభ్యంతరం చెప్పినా…

దీనికి కార‌ణం ఆరు మాసాల కింద‌టే మొద‌లైంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన తోట‌, వైసీపీ నుంచి బ‌రిలో దిగిన వేణు పోటీ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో వేణు విజ‌యం సాధించారు. దీంతో వేణు నియోజ‌క‌వ‌ర్గంలో ఆధిప‌త్యం చ‌లాయిం చాల‌ని చూశారు. కానీ, ఇంత‌లోనే తోట టీడీపీ సైకిల్ దిగేసి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అప్పటి వర‌కు తోట‌తో విభేదించిన వేణు.. ఆయ‌న రాక‌ను తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. తోట‌పై విజ‌యం సాధించేందుకు నానా తిప్పలు ప‌డ్డాన‌ని, ఇప్పుడు అలాంటి నాయకుడిని పార్టీలోకి ఎలా తీసుకుంటార‌ని బ‌హిరంగంగానే వ్యాఖ్యానించారు.

తోట వ్యూహంతో….

అయితే, వైసీపీలో వేణు మాట క‌న్నా తోట వ్యూహానికే మార్కులు ప‌డ్డాయి. అయితే, అప్పటి నుంచి కూడా వేణు అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా తోట‌పై విరుచుకుప‌డుతున్నారు. ఇటీవ‌ల పార్టీ సీనియ‌ర్లు వైవీ సుబ్బారెడ్డి వంటి నాయ‌కులు వ‌చ్చిన‌ప్పుడు వేణు త‌న అనుచ‌రుల‌తో వీరంగం సృష్టించారు. ఈ ప‌రిణామాలు జ‌గ‌న్ దృష్టికి చేరాయ‌ని తెలిసింది. వేణు వ్యవ‌హార శైలిపై జ‌గ‌న్ నివేదిక కోరిన‌ట్టు తెలిసింది. ఈ క్రమంలోనే తోట వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించారు. సుబ్బారెడ్డి పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనల్లో సంయమనం పాటించానని చెప్పుకొచ్చారు. అంతేకాదు, పార్టీలో తన చేరిక ఇష్టం లేనివాళ్లు అధినాయకుడికి చెప్పాలన్నారు.

అధిష్టానం సీరియస్…..

జరిగిన ఘటనలపై పోలీసులు వారి పనివారు చేస్తారని, తాను ఫిర్యాదు చేయబోనని తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. ఇక ఈ సంఘ‌ట‌న‌పై అటు పార్టీ ప‌రిశీల‌కులు సుబ్బారెడ్డి, మంత్రి మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ కూడా సీరియ‌స్ అయ్యారు. అటు అధిష్టానం సైతం నివేదిక కోరిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు వేణు అధిష్టానానికి శత్రువుగా మారే అవకాశముంది. పైగా వేణు నాన్ లోకల్ కావడం కూడా అక్కడ కొంత ఇబ్బంది పెడుతోంది. మొత్తం మీద వేణు వ్యవహారంలో వైసీపీ అధిష్టానం ఎటువంటి చర్యలకు దిగుతుందనేది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News