పోటీ చేయం మొర్రో అంటున్న తమ్ముళ్ళు ?

శ్రీకాకుళం జిల్లా టీడీపీకి కంచుకోట. అక్కడ నుంచి ఒక టైమ్ లో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ కూడా పోటీ చేసి విజయం సాధించారు. అలాంటి జిల్లా గత [more]

Update: 2021-04-07 15:30 GMT

శ్రీకాకుళం జిల్లా టీడీపీకి కంచుకోట. అక్కడ నుంచి ఒక టైమ్ లో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ కూడా పోటీ చేసి విజయం సాధించారు. అలాంటి జిల్లా గత రెండేళ్ళుగా పసుపు పార్టీని పరేషాన్ చేస్తోంది. సిక్కోలులో గత సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కళా వెంకటరావు ఓడిపోతే, తాజాగా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఇలాకాలోనూ పార్టీ దెబ్బ తింది. ఇక మహామహులైన టీడీపీ నేతలకూ సొంతూళ్ళలో దెబ్బ తప్పలేదు.

సర్వే షాక్ ….

టీడీపీ తాజాగా శీకాకుళం జిల్లాలో పార్టీ పరిస్థితి మీద ఒక సర్వే జరిపిస్తే అందులో విస్తుబోయే నిజాలు వెలుగు చూశాయని టాక్. అధికార వైసీపీ బలం తగ్గిందా. టీడీపీ పుంజుకుంటుందా అంటూ సర్వేలో వేసిన ప్రశ్నలకు మేము పూర్తిగా చితికిపోయాం. ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన కూడా లేదని తమ్ముళ్ళు తెగేసి చెప్పారట. అంతే కాదు, తాము లక్షలు పోసి పోటీపడలేమని కూడా తేల్చేశారట. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తాము నిలబడమని కూడా స్పష్టంగా చెప్పేశారని టాక్.

ఎందుకిలా…?

శ్రీకాకుళం జిల్లాలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని చెప్పాలి. టీడీపీకి ఇదే తొలి ఓటమి కాదు, ఇంతకు ముందు మూడు సార్లు ఓడింది. అయితే నాటికీ నేటికీ చాలా తేడా ఉందని అంటున్నారు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. పైగా అది జాతీయ పార్టీ. దాంతో రాష్ట్రంలో ఉన్న నాయకులు కానీ పెద్దలు కానీ జిల్లా మీద పూర్తి ఫోకస్ పెట్టేవారు కాదు, ఇక కాంగ్రెస్ లో ఉన్న గ్రూప్ రాజకీయాల వల్ల కూడా టీడీపీ బతికి బట్ట కట్టేసేది. మరో వైపు కాంగ్రెస్ లో పడని గ్రూపులే టీడీపీని గెలిపించేందుకు కూడా ఇండైరెక్ట్ గా కృషి చేసేవి. కానీ ఇపుడు డైరెక్ట్ ఫైట్. అది కూడా ఏకంగా వైసీపీ హై కమాండ్ నుంచే మోనిటరింగ్ జరుగుతోంది. డూ ఆర్ డై అన్నట్లుగా వైసీపీ క్యాడర్ ని రెడీ చేసి టీడీపీ మీదకు పంపుతోంది.

అండగా ఉంటారా…?

తెలుగుదేశం అధినాయకత్వం ధీటుగా పోరాడమంటోంది. పైగా కేసులు పెట్టినా కూడా భయపడవద్దు అంటోంది. కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో తెగించి పోరాడిన వారంతా ఇపుడు ఓడిపోయి కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు చూస్తే క్యాడర్ కూడా డీ మోరలైజ్ అవుతోంది. నేతలు చెబుతున్నా కూడా బయటకు రాలేని పరిస్థితి ఉంది అంటున్నారు. అధికారంలో వైసీపీ ఉండడం, పోలీసుల మద్దతు కూడా వైసీపీకి ఉండడంతో ఢీ కొట్టలేకపోతున్నారు అని అంటున్నారు. మొత్తానికి కంచు కోట లాంటి శ్రీకాకుళం జిల్లాలోనే పసుపుపార్టీ ఇలా చేతులు ఎత్తేస్తే మిగిలిన జిల్లాల గురించి సర్వే అవసరమా అన్న ప్రశ్న వస్తోంది. దీనికి విరుగుడుగా క్యాడర్ ని సమాయత్తం చేసేందుకు ఏం చేయాలో టీడీపీ హై కమాండే ఆలోచించుకోవాలేమో.

Tags:    

Similar News