జ‌గ‌న్‌కు షాకిచ్చిన క‌డ‌ప జ‌నం.. రీజ‌న్ తెలిస్తే…?

క‌డ‌ప అంటేనే.. వైసీపీకి పెట్టనికోట‌గా ప్రచారంలో ఉంది. అంద‌రూ దీనిని ఒప్పుకొంటారు కూడా. గ‌త అ సెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇక్కడ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక‌, [more]

Update: 2021-02-23 06:30 GMT

క‌డ‌ప అంటేనే.. వైసీపీకి పెట్టనికోట‌గా ప్రచారంలో ఉంది. అంద‌రూ దీనిని ఒప్పుకొంటారు కూడా. గ‌త అ సెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇక్కడ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక‌, ప్ర‌తిప‌క్షం టీడీపీ జిల్లాలో అడ్ర‌స్ కూడా లేకుండా పోయింది. అంతేకాదు.. గత ఎన్నిక‌ల త‌ర్వాత‌.. టీడీపీ కీల‌క నేత‌లు గుండుగుత్తుగా పార్టీ మారి.. త‌లో దిక్కూపోయారు. దీంతో క‌డ‌ప‌పై చంద్రబాబు.. ఆయ‌న ప‌రివారం అంతా కూడా ఆశ‌లు వ‌దులుకున్నారు. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో క‌డ‌ప‌లో టీడీపీ మ‌ద్దతు దారులు అనూహ్య విజ‌యం సాధించ‌డం.. టీడీపీలో ఆశ‌లు రేకెత్తిస్తుండ‌గా.. వైసీపీలో మాత్రం గుబులు రేపుతుండ‌డం గ‌మ‌నార్హం. టీడీపీ గెలుచుకున్న స‌ర్పంచ్ స్థానాల సంఖ్య త‌క్కువే అయినా ఆ పార్టీ గెలుచుకున్నవి అన్నీ కీల‌క స్థానాలే కావ‌డం విశేషం.

తొలి విడత ఎన్నికల్లో….

తొలి విడ‌త‌లో ఏకగ్రీవాలు పోనూ 155 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరిగితే టీడీపీ మద్దతుదారులు 98 స్థానాలకు పోటీ చేశారు. 30 స్థానాల్లో విజయం సాధించడం గ‌మ‌నార్హం. జిల్లాలో ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో వ‌చ్చిన ఫ‌లితాలు.. టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నాయి. తొలివిడతలో 206 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 51 సర్పంచి స్థానాలు ఏకగ్రీవ మయ్యాయి. 155 సర్పంచి స్థానాలకు పోటీ జరిగింది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 19 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. టీడీపీ మద్దతుదారులు 8 పంచాయతీల్లో మాత్రమే పోటీ చేసి 5 స్థానాల్లో గెలిచారు.

కొన్ని నియోజకవర్గాల్లో…..

బద్వేలు నియోజకవర్గంలో 68 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 44 స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. అందులో 12 స్థానాల్లో విజయం సాధించింది. జిల్లా వ్యాప్తంగానే తీవ్ర ఉత్కంఠ రేపిన పోరుమామిళ్ల మేజ‌ర్ పంచాయ‌తీలో టీడీపీ అభ్యర్థి సుథాక‌ర్ నాయుడు 300 ఓట్ల మెజార్టీతో గెలిచి ప్రకంప‌న‌లు రేపారు. మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారులు 46 స్థానాల్లో పోటీ చేసి 10 పంచాయతీలను కైవసం చేసుకున్నారు.

తక్కువ స్థానాలయినా..?

పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను అధికార వైసీపీ తన ఖాతాలో వేసుకున్నా.. తక్కువ స్థానాల్లో పోటీ చేసి అధికార పార్టీని ఎదురొడ్డి 27.55 శాతం స్థానాలు దక్కించుకోవడం తెలుగుదేశం నేత‌ల్లో హుషారు నింపింద‌న‌డంలో సందేహం లేదు. అయితే.. త‌మ‌కు ప‌ట్టు కొమ్మగా ఉన్న జిల్లాలో అందునా.. సీఎం సొంత జిల్లాలో ప‌దేళ్లుగా టీడీపీకి అస్సలు ప్రాతినిధ్యం లేకుండా ( 2014లో ఒక్క రాజంపేట త‌ప్ప ) ఇలా టీడీపీ దూకుడుతో ముందుకు సాగ‌డం అధికార పార్టీ నేత‌ల‌కు నోట మాట లేకుండా చేసింద‌నండంలో సందేహంలేదు.

Tags:    

Similar News