బిగ్ బ్రేకింగ్ : కుమార సర్కార్ అవుట్

కర్ణాటక రాజకీయాలు కొద్దిసేపటి క్రితం అనూహ్య మలుపులు తిరిగాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనంద్ సింగ్, రమేష్ జార్ఖిహోళి లు రాజీనామా చేశారు. తాజాగా మరో [more]

Update: 2019-07-06 07:40 GMT

కర్ణాటక రాజకీయాలు కొద్దిసేపటి క్రితం అనూహ్య మలుపులు తిరిగాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనంద్ సింగ్, రమేష్ జార్ఖిహోళి లు రాజీనామా చేశారు. తాజాగా మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామాలక సిద్ధ పడ్డారు. రాజీనామా లేఖలను ఇచ్చేందుకు స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. రామలింగారెడ్డి, సౌమ్యారెడ్డి, సోమశేఖర్ రెడ్డి, బీసీ పాటిల్ మునిరత్న, రమేష్ జార్ఖిహోళి, ప్రసాద్ పాటిల్, శివరామ్ లు స్పీకర్ కార్యాలయానికి చేరుకున్న వారిలో ఉన్నారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రభుత్వం కుప్ప కూలడం ఖాయం. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.

Tags:    

Similar News