వైసీపీది విద్వంసమా …టీడీపీ విష ప్రచారం

అయిదేళ్ళ పాటు అధికారం చలాయించిన తెలుగుదేశం పార్టీ అన్ని హద్దులూ చెరిపేసింది. పార్టీని,ప్రభుత్వాన్ని కూడా కలిపేసి ఖజానాకు ఖర్చు రాసేసింది. గత పాలనలో అవినీతి, అక్రమాలు బాగా [more]

Update: 2019-06-29 02:30 GMT

అయిదేళ్ళ పాటు అధికారం చలాయించిన తెలుగుదేశం పార్టీ అన్ని హద్దులూ చెరిపేసింది. పార్టీని,ప్రభుత్వాన్ని కూడా కలిపేసి ఖజానాకు ఖర్చు రాసేసింది. గత పాలనలో అవినీతి, అక్రమాలు బాగా పెచ్చరిల్లాయని అనేక నివేదికలు చెబుతున్నాయి. ఇక పాలనలో కుల పక్షపాతం ఉందన్నది వైసీపీ నేతలు అధారసహితంగా నిరూపించేసింది. ఇవన్నీ కలసి టీడీపీని దారుణంగా పరాజయం పాలు చేశాయి. అదే సమయంలో వైసీపీని బంపర్ మెజారిటీతో గద్దెనెక్కించాయి. ఇవన్నీ ఇలా ఉంటే తాము ఏపీ అభివ్రుధ్ధి కోసం ఎంతో చేశామని, ఎన్నో కట్టడాలు నిర్మించామని టీడీపీ తమ్ముళ్ళు గొప్పలు చెబుతున్నారు. తాము చేసిన అభివ్రుధ్ధిని చూడలేక కట్టిన వాటిని అడ్డంగా కూలగొడుతున్నారని వితండ వాదనలు లేవదీస్తున్నారు.

ప్రజావేదిక కూల్చడం పాపమట :

ఇక ప్రజావేదిక అక్రమ నిర్మాణం అన్నది తెలిసి కూడా బుకాయిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు కూల్చివేతను మహా పాపంగా చిత్రీకరిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి గట్టిగా నెల దాటలేదు కానీ ఆయన మీద విద్వంస‌కారుడు అన్న ముద్ర వేసేందుకు రెడీ అయిపోతున్నారు. తాము ఎంతో కష్టపడి ఒక్కోటీ కడితే జగన్ వాటిని అయిదు నిముషాల్లో కూల్చేస్తున్నాడని కొత్త ఆరోపణలు చేస్తున్నారు. అసలు విషయం చెప్పకుండానే ఒక్క ఇటుక కూడా అభివ్రుధ్ధి కోసం జగన్ వేయలేదని, కానీ తాము కట్టిన వాటిని కూల్చేందుకు చేతులెలా వచ్చాయని నిగ్గదీస్తున్నారు. ఎంపీ కేశినేని నాని అయితే జగన్ యూపీ సీఎం అయితే తాజ్ మహల్ కూడా కూలగొడతాడు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. మరో సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు పోలవరం, సచివాలయం కూడా కూల్చేయండి అంటూ మండిపడుతున్నారు. ఇక వర్ల రామయ్య, వైవీ రాజేంద్రప్రసాద్ లాంటి నేతలైతే కక్ష పూరితంగా జగన్ వ్యవహరిస్తున్నారని అంటున్నారు. పిచ్చోడి చేతిలో రాయిలా జగన్ కి అధికారం దక్కిందని విమర్శలు చేస్తున్నారు.

అక్రమ కట్టడాలు గొప్పేనా :

దీని మీద వైసీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. అక్రమ కట్టడాలు కూడా గొప్పేనా, పైగా వాటి అంచనాలు దారుణంగా పెంచేసి అవినీతి పనులు చేస్తే చూస్తూ వూరుకోవాలా అంటున్నారు. కట్టడం గొప్ప కాదు, ఎక్కడ కట్టామన్నది చూడాలని అంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా జగన్ ప్రజావేదికను కూల్చడాన్ని ఆంధ్ర జాతికి కలిగిన అతి భారీ నష్టంగా పదే పదే చెబుతూ కధనాలు వండి వారుస్తోంది. మరి ఒక్క అక్రమ కట్టడానికే ఇలా అయిపోతే రానున్న రోజుల్లో కరకట్ట మీదున్న అక్రమ నిర్మాణాలు వైసీపీ సర్కార్ కూలిస్తే టీడీపీ ఏమైపోతుందో. జగన్ని ఏకంగా ఏ విదేశీ దండయాత్రికుడిగా చిత్రీకరిస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News