అంతా ఆ స్కూల్ లో జాయిన్ అయిపోతారా ..?

తెలంగాణ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసాయో లేదో కారు, కమలం జోరు మీద ఉండగా హస్తం, సైకిళ్ళు వారి దెబ్బకు బేజారు అయిపోతున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన [more]

Update: 2019-06-14 02:29 GMT

తెలంగాణ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసాయో లేదో కారు, కమలం జోరు మీద ఉండగా హస్తం, సైకిళ్ళు వారి దెబ్బకు బేజారు అయిపోతున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన శాసన సభ్యుల్లో 12 మందిని గులాబీ పార్టీ కలిపేసుకుని సీఎల్పీ లేకుండా చేసింది. ఇక ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోకుండానే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచిన కమలం తెలంగాణ లో పార్టీ విస్తరణ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ముఖ్యంగా కాంగ్రెస్ టిడిపి లలో మిగిలి పోయిన హేమా హేమీలనుంచి ద్వితీయ శ్రేణి నాయకుల వరకు కమలం కి జై కొట్టేలా ఆపరేషన్ ఆకర్ష్ కి పెద్ద ఎత్తునే తెరతీసింది. అదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

రంగంలో రామ్ మాధవ్

ఎలాంటి వారినైనా కమలం కి జై కొట్టేలా చేయగలిగే ఆరెస్సెస్ నేత కేంద్ర బిజెపిలో కీలకమైన రామ్ మాధవ్ తాజాగా తెలంగాణ లో మకాం వేశారు. ఆయన వద్దకు వరుసగా ఇప్పుడు టి టిడిపి నాయకులు, టి కాంగ్రెస్ నేతలు క్యూ కట్టేస్తున్నారు. వీరిలో ఇటీవలే గెలిచిన కాంగ్రెస్ ఎంపీల నుంచి కొందరు ఎమ్యెల్యేలు కూడా ఉండటం గమనార్హం. కేంద్రంలో యుపిఎ సర్కార్ రాకపోవడం, గులాబీ పార్టీ ప్రత్యర్థులను టార్గెట్ చేయడం భరించలేని వారినందరిని గుర్తించి పార్టీలో సముచిత స్థానానికి రామ్ మాధవ్ భరోసా కల్పిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ జిల్లాలో కమల వికాసానికి పటిష్టమైన క్యాడర్ వున్న లీడర్ లను వలవేసి లాగుతున్నారు మాధవ్.

పసుపు పారాణి ఆరకముందే

ఎన్నికల్లో ఫలితాలొచ్చి నెలరోజులు కూడా కాకుండానే గెలిచిన, ఒడిన వారంతా అధికార పార్టీలవైపు దృష్టి పెట్టేశారు. అవకాశం వున్న వారు ఆఫర్లు అందుకున్న వారు గులాబీ కోటలోకి దూకేస్తే ఇక పార్లమెంట్ స్థానాల్లో గెలిచిన ఒడిన వారు ఇక కాంగ్రెస్ టిడిపి లతో “లాభం ” లేదని డిసైడ్ అయిపోయి కేంద్రంలోని బిజెపి సర్కార్ కి జై కొట్టేయాలని అంచనాకు వచ్చేశారు. ఇలా వచ్చిన వారిలో కోమటిరెడ్డి బ్రదర్స్, రేవంత్ రెడ్డి వంటి వారితో పాటు ఒక రాజ్యసభ సభ్యుడు మరో ఎమ్యెల్యే కూడా ఉన్నారన్న ప్రచారం సాగుతుంది. వీరంతా రామ్ మాధవ్ తో రహస్య భేటీ సాగించినట్లు పొలిటికల్ లోకం కోడై కూస్తుంది.

Tags:    

Similar News