సోమిరెడ్డి అరెస్ట్ కు.?

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై కేసు నమోదు అయింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్రమంగా ప్రభుత్వ భూములను అమ్ముకున్నారంటూ ఒక వ్యక్తి కోర్టులో కేసు [more]

Update: 2019-08-28 05:45 GMT

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై కేసు నమోదు అయింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్రమంగా ప్రభుత్వ భూములను అమ్ముకున్నారంటూ ఒక వ్యక్తి కోర్టులో కేసు వేశారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇడిమేపల్లిలో 2.40 ఎకరాల భూమిని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విక్రయించారని ప్రధాన అభియోగం. దీంతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాను అరెస్ట్ కాకుండా న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఏ సమయంలోనైనా అరెస్ట్ చేసే అవకాశముంది.

Tags:    

Similar News