శత్రువు…ఎన్నటికీ శత్రువే

కర్ణాటక రాష్ట్రంలో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత సంకీర్ణంలో ఉన్న రెండు పార్టీలకూ క్షణం పొసగడం లేదు. శాసనసభలో పెద్దగా బలం లేని భారతీయ జనతా పార్టీని [more]

Update: 2019-08-26 16:30 GMT

కర్ణాటక రాష్ట్రంలో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత సంకీర్ణంలో ఉన్న రెండు పార్టీలకూ క్షణం పొసగడం లేదు. శాసనసభలో పెద్దగా బలం లేని భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయాల్సిన సిద్ధరామయ్య, కుమారస్వామి ఆ ప్రయత్నం చేయకపోగా మైత్రీ బంధానికి తూట్లుపడేలా వ్యవహరిస్తున్నారు. కోర్టు తీర్పుతో 17 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశమున్నా, కాంగ్రెస్, జేడీఎస్ లు బీజేపీకి ప్రయోజనం చేకూరేలా వ్యవహరిస్తున్నాయి.

తండ్రీకొడుకులు…..

నిన్న తండ్రి దేవెగౌడ… నేడు తనయుడు కుమారస్వామి. ఇద్దరూ తమ శత్రువు సిద్ధరామయ్య అంటూ చెబుతున్నారు. సిద్ధరామయ్య చేతకానితనం వల్లనే ఓటమి పాలయ్యామని, సంకీర్ణ సర్కార్ కుప్పకూలిందని దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు గంటలు గడవకముందే కుమారస్వామి సిద్ధరామయ్యపై నిప్పులు చెరిగారు. తన తొలి శత్రువు సిద్ధరామయ్యేనని సంచలన ప్రకటన చేశారు. తొలి నుంచి తాను ముఖ్యమంత్రి కావడం సిద్ధరామయ్యకు ఇష్టంలేదని చెప్పుకొచ్చారు.

ఒకరిపై ఒకరు….

14 నెలల తన పాలనలో సిద్ధరామయ్య తన సమయాన్నంతా సొంత పార్టీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడానికే వ్యవహరించారని కుమారస్వామి ధ్వజమెత్తారు. అయితే సిద్ధరామయ్య దీనికి ధీటుగానే కౌంటర్ ఇచ్చారు. కుమారస్వామి చేతకానితనం వల్లనే సర్కార్ కూలిపోయిందన్నారు. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగిపోవడంతో ఇక రెండు పార్టీలూ కలిసి పనిచేయడం కష్టమేనని తేలిపోయింది. నిజానికి ఇద్దరి మధ్య యుద్ధం కొత్తేమీ కాకపోయినా బీజేపీని నిలువరించేందుకు, ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కలసికట్టుగా ఉంటారని ఇరు పార్టీల క్యాడర్ భావించింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిద్దరామయ్య సీబీఐ విచారణను కోరడం కూడా కుమారస్వామికి కోపం తెప్పించిందంటున్నారు.

అందుకే కోపం…..

తనను ఇరికించడానికే సిద్ధరామయ్య ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణను కోరారని కుమారస్వామి అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఉప ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన సమయంలో రెండు పార్టీలూ విడిపోవడం బీజేపీకి లాభదాయమకమే. సిద్ధరామయ్య ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కు సంకేతాలు పంపారు. పదిహేడు స్థానాలకు కొత్త అభ్యర్థుల ఎంపికను ప్రారంభించాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఢిల్లీ వెళ్లి దీనిపై సిద్ధరామయ్య స్పష్టత తెచ్చుకునే అవకాశముంది. దేవెగౌడ కూడా కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ అయి అమితుమీ తేల్చుకునేందుకు సిద్ధపడ్డారని తెలుస్తోంది.

Tags:    

Similar News