ఆఫర్ వద్దంటున్నాడే

సాకే శైలజానాధ్. కాంగ్రెస్ లో ఒకప్పుడు వెలుగువెలిగిన నేత. అయితే 2014 నుంచి శైలజానాధ్ రాజకీయంగా ట్రబుల్స్ లో ఉన్నారు. కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న శైలజానాథ్ [more]

Update: 2019-10-26 09:30 GMT

సాకే శైలజానాధ్. కాంగ్రెస్ లో ఒకప్పుడు వెలుగువెలిగిన నేత. అయితే 2014 నుంచి శైలజానాధ్ రాజకీయంగా ట్రబుల్స్ లో ఉన్నారు. కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న శైలజానాథ్ జగన్ పార్టీ పెట్టినప్పుడు వెళ్లలేదు. కాంగ్రెస్ లోనే కొనసాగారు. అయితే అప్పుడు రాష్ట్ర విభజన జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ చేస్తుందని శైలజానాధ్ ఊహించలేదు. ఎంత వ్యతిరేకించినా రాష్ట్ర విభజన చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగై పోయింది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇస్తామని అధిష్టానం సంకేతాలు పంపుతున్నా ఆయన ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

రెండుసార్లు గెలిచి….

సాకే శైలజానాధ్ 2009, 2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మంత్రిగా కూడాపనిచేశారు. వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగా పేరొందారు. దళిత నేత కావడంతో సహజంగానే కాంగ్రెస్ లో ఎదిగారు. అయితే అదే కాంగ్రెస్ ను ఆయన వీడలేదు. జగన్ పార్టీకి వెళ్లలేదు. ఫలితంగా అదే నియోజకవర్గమైన సింగనమల నియోజకవర్గం నుంచి 2014, 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. నిజానికి శైలజానాధ్ కు వైసీపీ, తెలుగుదేశం పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా ఆయన కాదనుకున్నారు.

అధిష్టానం వద్ద….

శైలజానాధ్ కు కాంగ్రెస్ అధిష్టానం వద్ద పట్టుంది. యువకుడు, సబ్జెక్ట్ ఉన్న నేత కావడంతో రాహుల్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా శైలజానాధ్ కు ప్రయారిటీ ఇచ్చారు. కర్ణాటక ఎన్నికల సమయంలో శైలజానాధ్ కు కీలక బాధ్యతలను అప్పగించారు. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చడంతో శైలజానాధ్ కు పార్టీ హైకమాండ్ వద్ద ప్రత్యేక గుర్తింపు లభించింది. తాజాగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇక్కడ ఏపీసీసీ చీఫ్ గా ఉన్న రఘువీరారెడ్డి సయితం రాజీనామా చేశారు.

పీసీపీ చీఫ్ గా….

ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ కు అధ్యక్షుడు లేరు. దీంతో పార్టీ అధిష్టానం సాకే శైలజనాధ్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శైలజానాధ్ అయితే దళిత ఓటు బ్యాంకును ఆకట్టుకోగలరని నమ్ముతుంది. గతంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు గా ఉన్న దళితులు జగన్ పార్టీవైపు వెళ్లారు. తిరిగి కాంగ్రెస్ వైపు మళ్లాలంటే శైలజానాధ్ కు అధ్యక్ష్య బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సాకే శైలజానాధ్ ఇందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. తాను ఆ బాద్యతలను నెరవేర్చలేనని అధిష్టానంతో చెప్పినట్లు తెలిసింది. అయినా ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారట. మరి శైలజానాధ్ ఏపీకి చీఫ్ అవుతారా? లేదా? అన్నది కొద్దరోజుల్లోనే తెలిసిపోతుంది.

Tags:    

Similar News