సీఎం జగన్ ని వెంటనే కలవాల్సిన అవసరం ఏముంది?

నటుడు రాజేంద్ర ప్రసాద్ రీసెంట్ గా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ… జగన మోహన్ రెడ్డి సీఎం కాగానే వెళ్లి [more]

Update: 2019-08-10 07:05 GMT

నటుడు రాజేంద్ర ప్రసాద్ రీసెంట్ గా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ… జగన మోహన్ రెడ్డి సీఎం కాగానే వెళ్లి కలవడానికి సినీ నటులేం వ్యాపారవేత్తలు కాదన్నారు. సినీనటులకు ఖాళీ దొరికినప్పుడు వెళ్లి కలుస్తాం అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రిని వెంటనే కలవాలన్న నిబంధన ఏమీ లేదని గుర్తు చేశారు.

జగన్ సీఎం గా సెటిల్ అయినా తరువాత తీరిగ్గా ఉన్నప్పుడు కలుస్తామన్నారు. అలానే కమెడియన్ ఫృధ్వీని నేరుగా విమర్శించకపోయినప్పటికీ.. ఆయన వ్యాఖ్యలను మాత్రం రాజేంద్రప్రసాద్ తోసిపుచ్చినట్లయింది. జగన్ గారు సీఎం అవ్వడం సినీ పరిశ్రమకు ఇష్టం లేదనడం తప్పని…ఆయన అలా అని ఉండకూడదు అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

జగన్ తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని రాజేంద్ర ప్రసాద్‌ చెప్పుకున్నారు. పోసాని కృష్ణ మురళి కూడా ఫృధ్వీ వ్యాఖ్యలను తప్పు పట్టారు.

Tags:    

Similar News