మరోసారి లాక్ డౌన్ తప్పేట్లు లేదుగా?

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. భారత్ లో సెకండ్ వేవ్ ప్రారంభమయినట్లు వైద్య శాఖ చెబుతోంది. గత ఏడాది మార్చి నెల కంటే మించిన [more]

Update: 2021-04-06 18:29 GMT

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. భారత్ లో సెకండ్ వేవ్ ప్రారంభమయినట్లు వైద్య శాఖ చెబుతోంది. గత ఏడాది మార్చి నెల కంటే మించిన కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. రోజుకు 45 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం కరోనా తీవ్రతకు అద్దంపడుతుంది. ఇప్పటికే భారత్ లో కోటి ముప్ఫయి లక్షల మంది కరోనా బాధితులు చేరిపోయారు. మరణాల సంఖ్య కూడా దాదాపు రెండు లక్షలకు చేరువలో ఉంది.

సెకండ్ వేవ్ తీవ్రతతో…..

నిజానికి ఊహించిందే. అనేక దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. యూరప్ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వడంతో అక్కడ కొన్నిచోట్ల లాక్ డౌన్ ను కూడా విధించారు. అయితే భారత్ లో సెకండ్ వేవ్ స్టార్టవ్వడానికి అనేక రకాలు కారణాలు విన్పిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కరోనా వ్యాప్తికి కారణాలుగా వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భయం పోవడంతో….

మరోవైపు కరోనా వ్యాక్సిన్ రావడంతో ప్రజల్లో భయం పోయింది. గతంలో మాదిరి శానిటైజర్ లను వాడటం లేదు. గత మార్చితో పోలిస్తే శానిటైజర్ల వినియోగం పదిశాతం కూడా లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఇక భౌతిక దూరాన్ని కూడా పాటించకపోవడం మాస్క్ లను ధరించకపోవడం కూడా కరోనా వ్యాప్తికి కారణాలంటున్నారు. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై ఏప్రిల్ 30 వరకు కోవిడ్ నిబంధలను అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.

అప్రమత్తమయిన రాష్ట్రాలు…..

ఇదే పద్ధతిలో కరోనా వ్యాప్తి కొనసాగితే లాక్ డౌన్ మరోసారి తప్పదని వైద్యులు చెబుతున్నారు. అయితే గతంలో కంటే రికవరీ శాతం కొంత మెరుగుపడటం ఊరటనిచ్చే అంశం. అంతేకాకుండా ఆసుపత్రుల్లో ట్రీట్ మెంట్ కూడా మెరుగైంది. పడకల సంఖ్య కూడా బాగా పెంచేశాయి. దీంతో కరోనా వ్యాప్తి చెందినా మరణాల సంఖ్యను నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే పాక్షికంగానైనా లాక్ డౌన్ విధిస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.

Tags:    

Similar News