చర్చలు సాధ్యమేనా? అవకాశం ఎంతమాత్రం?

మావోయిస్టులతో చర్చలు ఇప్పుడు మరో సారి హాట్ టాపిక్ గా మారాయి. 2004 మావోయిస్టు శాంతి చర్చలు తరువాత , ఇప్పుడు ఛతీస్ ఘడ్ దాడి నేపథ్యం [more]

Update: 2021-04-09 00:30 GMT

మావోయిస్టులతో చర్చలు ఇప్పుడు మరో సారి హాట్ టాపిక్ గా మారాయి. 2004 మావోయిస్టు శాంతి చర్చలు తరువాత , ఇప్పుడు ఛతీస్ ఘడ్ దాడి నేపథ్యం లో శాంతి చర్చల తరహా లో మరోసారి అడుగులు పడుతున్నాయా ? మావోల దాడి లో 23 మంది పోలీసులు ప్రాణాలు పోయిన తరువాత ప్రభుత్వాలు చర్చలకు సానుకూలంగా ఉన్నారా ? లేక పరోక్షంగా మావోయిస్టు పార్టీనే చర్చల వ్యవహారం తెరపైకి తెస్తుందా ? ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి ఎవరు ముందుకు రానున్నారు ? చర్చలు పై ఇటు ప్రభుత్వం అటు మావోయిస్టు లకు పూర్తి విశ్వాసం ఉందా ?

చర్చలకు సానుకూలమంటూ…..

మావోయిస్టులు నోటా మరోసారి చర్చల మాట వినిపించింది. ప్రభుత్వం తో చర్చలకు సానుకూలంగా ఉన్నామని కొద్దీ రోజుల క్రితం మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది .. తాజగా ఛతీస్ ఘాడ్ దాడి తరువాత మావోలు చర్చలకు తాము ఎప్పుడైనా సిద్దమేనని వెల్లడించారు .. ప్రభుత్వం మధ్యవర్తులను పేర్లను వెల్లడిస్తే , తమ బందీ లో ఉన్న జవాన్ ను విడుదల చేస్తామని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట ఓ లేఖ ను విడుదల చేశారు.

ఇద్దరికీ నష్టమే…?

మొన్నటి ఎదురుకాల్పుల్లో 23 మంది పోలీసులు , నలుగురు మావోయిస్టులు మృతి చెందారు .. ఆ తరువాత దండకారణ్యం లో మావోలు కుంబింగ్ ఆపరేషన్ మరింత పెంచారు .. దీంతో మావోయిస్టులు కొన్ని డిమాండ్ ను ప్రభుత్వం ముందు ఉంచారు .. దండకారణ్యం లో వెంటనే కుంబింగ్ నిలిపేయాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది .. దండకారణ్యం లో అడవి బిడ్డలు ( గిరిజనులను ) ఇబ్బందులకు గురి చేయవద్దని తెలిపారు .. సిఆర్పీఎఫ్ జవాన్ లను అడవుల నుండి వెనిక్కి పంపేలా ఆదేశాలు ఇవ్వాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తుంది. దశాబ్ద కాలంగా పోలీసులకు , మావోయిస్టులులకు మధ్య యుద్దమే జరుగుతుంది .. రెండు వైపుల హోరా హోరీ గా జరుగుతున్న యుద్ధం లో ఇటు పోలీసులు, అటు మావోలు ప్రాణాలు కోల్పోతున్నారు.
దీనికి పులిస్టాప్ పెట్టాలంటే శాంతి చర్చలే సమాధానం అంటున్నారు.

అవకాశం ఎంతవరకు?

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చర్చలు జరిగే అవకాశం ఎంత వరకు ఉంది? మావోయిస్టుల బందీలో ఉన్న జవాన్ ను విడుదల చేయడానికి మాత్రమే చర్చలకు మావోయిస్టులు సిద్ధం అయ్యారా? లేక ఇప్పటి వరకు ఉన్న వారి డిమాండ్స్ పై గతంలో అంటే 2004 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన శాంతి చర్చలు తరహా లోనే ఇప్పుడు మరోసారి అన్నలు చర్చలకు సిద్ధం అయినట్లు వారి లేఖలు చుస్తే అర్థం అవుతుంది .. కానీ ఇటు ప్రభుత్వానికి ,అటు మావోయిస్టులుకు మధ్య సంధి కుదిర్చడం , చర్చలకు ఆహ్వానం పంపటానికి మధ్యవర్తిత్వం ఎవరు వహించాలనేదే ఉత్పన్న మవుతున్న ప్రశ్న .. ఒక వేళ ప్రభుత్వమే ఒక అడుగు ముందుకేసి మధ్య వర్తులను పంపాలి అనుకుంటే , వారి పేర్లు వెల్లడించాలని మావోయిస్టు పార్టీ లేఖ లో కోరింది. కానీ మేధావులు , పౌర సంఘ నాయకులు , ప్రజా సంఘాలు మాత్రం చర్చలనేవి సాధ్యం కావుఅంటున్నాయి

నమ్మి ముందుకొచ్చేది ఎవరు?

చర్చలు జరగాలి అంటే కేవలం ప్రభుత్వం ,మావోయిస్టులు మాత్రమే అనుకుంటే సరిపోదు.పౌర సమాజం , మేధావులు కలిసి ప్రభుత్వం పైన , మావోలు పైనే తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తేనే చర్చలకు అవకాశం ఉంటుంది కానీ , ఇప్పుడు మావోలు చర్చలు అన్నంత మాత్రానా జరిగే పరిస్థితి లేదంటున్నారు .. ఛతీస్ ఘడ్ లో చర్చలకు మధ్య వర్తిత్వం వహించడానికి ఎవరు లేరని , అక్కడ పౌర సంఘాలు , ప్రజా సంఘాలు గొంతులు నొక్కేయడం తో ఎవరు కూడా ప్రభుత్వాలను నమ్మి మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు .. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయం లో శాంతి చర్చలు పేరుతో ఓ ఐఏఎస్ అధికారి పౌర సంఘాలు , ప్రజా సంఘాలు తో ఓ కమిటీ రూపొందించి చర్చలకు సిద్ధం చేశారు .. కానీ అప్పటి ప్రభుత్వం చర్చలు పేరుతో పిలిచి మావోయిస్టులులు ఉనికి పసి గట్టి , అంతం చేయాలనే పథకం వేశారనే ఆరోపణలు మూట కట్టుకున్నారు .. దీంతో ఇటు ప్రభుత్వాలు పైన ఎవరికీ నమ్మకం లేదని , మధ్యవర్తిగా వ్యహరిస్తే ప్రజా సంఘాలు బలి అయ్యాయి. అయితే బందీగా ఉన్న రాకేశ్వర్ సింగ్ నువదిలిపెట్టడంతో ఇక చర్చల టాపిక్ కు మరోసారి బ్రేక్ పడినట్లే చెప్పుకోవాలి.

 

Tags:    

Similar News