లాక్ డౌన్ ను పూర్తిగా అలా వాడేసిన లోకేష్

తెలుగుదేశం అధినేత కుమారుడు, ఆ పార్టీ సెకండ్ బాస్ నారా లోకేష్ లాక్ డౌన్ ను ఎలా వాడాలో అలా వాడేశారు. ఆయన చేసిన కృషితో డిజిటల్ [more]

Update: 2020-05-28 03:30 GMT

తెలుగుదేశం అధినేత కుమారుడు, ఆ పార్టీ సెకండ్ బాస్ నారా లోకేష్ లాక్ డౌన్ ను ఎలా వాడాలో అలా వాడేశారు. ఆయన చేసిన కృషితో డిజిటల్ మహానాడు లో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నారా లోకేష్ మిగిలారు. నేతలు కార్యకర్తలు సైతం నారా లోకేష్ తాజా గెటప్ ను చూసి ఆశ్యర్య పోయారు. చినబాబు ఇంతలా ఎలా అనే చర్చ గట్టిగానే సాగింది. ఇంతకీ నారా లోకేష్ పై ఇంతటి చర్చకు కారణం ఆయన స్లిమ్ గా మారడమే కావడం విశేషం.

బాగా తగ్గారు …

నారా లోకేష్ ను చూస్తే చాలు ఆయన భారీ పర్సనాలిటీ పై ఎప్పుడు చర్చ నడిచేది. వైసిపి వెటకారంగా పప్పు అంటూ లోకేష్ ను హేళన చేసేది కూడా. ఈ విమర్శలను, హేళనలను అధిగమించే అవకాశం గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు క్షణం తీరిక లేకుండా గడపడంతో లోకేష్ కి లేకుండా పోయింది. అయితే లాక్ డౌన్ లో హైదరాబాద్ లో పెదబాబు తో పాటు చినబాబు చిక్కుకుపోయారు.

ఫిట్ నెస్ పై దృష్టి పెట్టి…….

దాదాపు రెండు నెలల కాలం భాగ్యనగరంలో అన్ని పనులకు దూరంగా ఉన్న నారా లోకేష్ ఫిట్ నెస్ పై బాగా దృష్టి మొదలు పెట్టారు. అమితంగా తినే లోకేష్ మితాహారం తో బాటు వర్క్ అవుట్ లు చేశారు. దాంతో ఆయన 20 కేజీలకు పైగా బరువు తగ్గి టిడిపి శ్రేణులకు ఆనందాన్ని మిగిల్చారు. అయితే ఇది ఎంతకాలం ఆయన మెయింటైన్ చేస్తారో చూడాలి. ఎందుకంటే స్వీట్స్ అంటే బాగా ఇష్టపడే నారా లోకేష్ వాటి జోలికి వెళ్లకుండా నోరు కట్టుకోవడం అంటే చిన్నవిషయం కాదు మరి.

Tags:    

Similar News