ఎవరైతే పైకి లేపారో.. వారివల్లనే పతనం తప్పదా?

బీజేపీకి అప్రతహితంగా విజయాలు తెచ్చిపెట్టడానికి మోదీ, అమిత్ షాలే కారణం. ఇది పార్టీలో ఏ ఒక్కరిని అడిగినా కాదనలేరు. అసలు బీజేపీకి జవసత్వాలు అందించిన వాజ్ పేయి, [more]

Update: 2021-02-18 18:29 GMT

బీజేపీకి అప్రతహితంగా విజయాలు తెచ్చిపెట్టడానికి మోదీ, అమిత్ షాలే కారణం. ఇది పార్టీలో ఏ ఒక్కరిని అడిగినా కాదనలేరు. అసలు బీజేపీకి జవసత్వాలు అందించిన వాజ్ పేయి, అద్వానీలను పార్టీ ఏనాడో మరచిపోయింది. అద్వానీ రధయాత్ర ద్వారా, వాజ్ పేయి పాలన ద్వారా బీజేపీకి దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజం వేశారు. దాని ఫలితం 2014లో దక్కింది. అప్పటికే పదేళ్ల పాటు కాంగ్రెస్ పాలనను చూసి విసిగిపోయిన ప్రజలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ ప్రధానిగా వస్తారంటే చప్పట్లతో స్వాగతం చెప్పారు.

ఏడేళ్ల క్రితం…..

2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక వెనుదిరిగి చూసుకోలేదు. దేశంలో అనేక రాష్ట్రాలను బీజేపీ సొంతం చేసుకోగలిగింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ను రెండు, మూడు రాష్ట్రాలకే పరిమితం చేయగలిగింది. ప్రతి రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడటంతో ఇదంతా మోదీ, షా చలవ వల్లనే అన్నది క్యాడర్ బలమైన నమ్మకం. వారి వల్లనే పార్టీని దేశ వ్యాప్తంగా విస్తృతం చేయగలిగామని సంఘ్ పరివార్ సయితం నమ్ముతోంది.

రానున్న కాలంలో…..

అయితే రానురాను ఈ ఇద్దరి కారణంగానే పార్టీ అన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోవడం ఖాయమన్న కామెంట్స్ బలంగా విన్పిస్తున్నాయి. ఈ ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎక్కడా ఎగరకపోవచ్చు. అలాగే ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ లకు జరిగే ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు అంత సులువు కాదు. ఇప్పటికే గుజరాత్, యూపీల్లో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. బీహార్ ఎన్నికలలో బీజేపీ గెలిచినా అది గెలుపు కానే కాదు.

ప్రభుత్వంపై వ్యతిరేకత…..

రానున్న కాలంలో ఏ రాష్ట్రంలో ఎన్నికల జరిగినా మోదీ, షాలకు ఇబ్బందులు తప్పేట్లు లేవు. దీనికి కారణం వీరి నిర్ణయాలు ఏకపక్షంగా ఉండటమే. మిత్రులు సయితం ఒక్కొక్కరే దూరం అవుతున్నారు. ప్రజాప్రయోజనాలను పక్కన పెట్టి పారిశ్రామిక వేత్తలకు ఈ గుజరాతీ నేతలు ఉపయోగపడుతున్నారన్న విమర్శలు బాగా స్ప్రెడ్ అయ్యాయి. ఎవరి వల్ల అయితే బీజేపీ దేశ వ్యాప్తంగా జెండా ఎగురవేయగలిగిందో వారి వల్లనే పతనం కూడా తప్పదని చెప్పాలి.

Tags:    

Similar News