కన్నబాబు కి బుల్లెట్ ప్రూఫ్ అందుకేనా …?

ఏపీ క్యాబినెట్ మంత్రి కురసాల కన్నబాబు కొద్ది రోజులుగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం వినియోగిస్తున్నారు. దీనిపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ [more]

Update: 2020-09-05 13:30 GMT

ఏపీ క్యాబినెట్ మంత్రి కురసాల కన్నబాబు కొద్ది రోజులుగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం వినియోగిస్తున్నారు. దీనిపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో వ్యవసాయ శాఖామంత్రిగా ముఖ్యమంత్రి జగన్ కి కన్నబాబు బాగా సన్నిహితంగా ఉన్నారు. నిత్యం మీడియా లో కూడా ప్రభుత్వ గొంతును కన్నబాబే వినిపిస్తారు. విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ గా కూడా ఉన్న కన్నబాబు పై ప్రస్తుతం మావో ల కన్ను పడినట్లు, మరికొన్ని కారణాలు ఉన్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు భావించడం తో ఆయన భద్రత పై జాగ్రత్తలు మొదలు అయినట్లు టాక్.

క్యాపిటల్ చుట్టూ …

అయితే దీనిపై నిఘా వర్గాలు ఎలాంటి సమాచారం భద్రత కారణాల రీత్యా బయటపెట్టలేదు. ప్రస్తుతం ఎపి లో ముఖ్యమంత్రి జగన్ కి తప్ప హోం మంత్రికి సైతం బుల్లెట్ ప్రూఫ్ వాహనం వినియోగించడం లేదు. కానీ కన్నబాబు కి మాత్రం ఇది కేటాయించడం హాట్ టాపిక్ అయ్యింది. విశాఖ ను కార్య నిర్వాహక రాజధానిగా ప్రకటించాకా అక్కడకు విఐపి ల రాకపోకలు బాగా పెరిగాయి. దాంతో బాటు విశాఖ ఏజెన్సీ కేంద్రంగా మావో ల యాక్టివిటీ కొంతకాలంగా పెరిగిందంటున్నారు.

మావోల నుంచి….

దీనితోబాటు ల్యాండ్ మాఫియా ల ఆగడాలు కూడా ఇటీవల విశాఖలో ఎక్కువ అయ్యాయి. ఇలాంటివన్నీ అంచనా వేసి కన్నబాబు భద్రత ను పెంచినట్లు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతుంది. జర్నలిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టి రాజకీయాల్లో రాణించి మంత్రిగా ఎదిగిన కన్నబాబు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటారని అంతా అంటారు. సౌమ్యుడిగా పేరొందిన ఆయనకు ముప్పు ఉందా అనే వార్త మంత్రి అభిమానుల్లో ఆందోళనకు గురిచేస్తుంది.

Tags:    

Similar News