వైసీపీలో ఊహించ‌ని నేత‌కు మంత్రి ప‌ద‌వా ?

ప్రస్తుతం మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్న వారు తాడేప‌ల్లిలో మ‌కాం వేస్తున్నారు. వీరిలో కీల‌క‌మైన నాయ‌కుడుగా ఇప్పుడు తెర‌మీదికి వ‌స్తున్నారు.. విశాఖ జిల్లా చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం [more]

Update: 2021-04-06 02:00 GMT

ప్రస్తుతం మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్న వారు తాడేప‌ల్లిలో మ‌కాం వేస్తున్నారు. వీరిలో కీల‌క‌మైన నాయ‌కుడుగా ఇప్పుడు తెర‌మీదికి వ‌స్తున్నారు.. విశాఖ జిల్లా చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మశ్రీ. ప్రస్తుతం ఈ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్‌ను అనేక కార‌ణాల‌తో తప్పిస్తే అదే జిల్లా నుంచి కేబినెట్లో ఇప్పటి వ‌ర‌కు ఒక యువ నేత పేరు జోరుగా వినిపించింది. ఆ నేత ఫ్యామిలీ నేప‌థ్యం… పార్టీ ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు పార్టీ ప‌గ్గాలు మోయడం… అటు అధిష్టానంతో ఉన్న అనుబంధం నేప‌థ్యంలో ఆయ‌నే మంత్రి అవుతార‌ని అంద‌రూ అనుకున్నారు. సామాజిక స‌మీక‌ర‌ణ‌లు కూడా ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చాయి.

వైఎస్ తో అనుబంధం…..

అయితే.. సొంత పార్టీలో నే అంత‌ర్గత కుమ్ములాట‌ల‌తో తీరిక‌లేకుండా ఉన్న ఈయ‌న ను ప‌క్కన పెట్టి.. అనూహ్యంగా క‌ర‌ణం ధ‌ర్మశ్రీ పేరు ను ప‌రిశీల‌న‌లోకి తీసుకోవాల‌ని నిర్ణయించుకున్నట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల నుంచి అత్యంత విశ్వస‌నీయంగా తెలిసింది. వైఎస్ కుటుంబంతో అత్యంత స‌న్నిహిత సంబంధాలు ఉన్న క‌ర‌ణం ధ‌ర్మశ్రీ అదే రెపోను జ‌గ‌న్‌తోనూ కొన‌సాగించారు. వైఎస్ అంటే ప్రాణం పెట్టే ఈయ‌న‌.. గ‌తంలో వైఎస్ మార్గద‌ర్శక‌త్వంలో ప‌నిచేశారు. ఆయ‌న చెప్పిన మాట వినే నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. పాద‌యాత్ర స‌మ‌యం నుంచి కూడా వైఎస్‌తో అనుబంధం పెంచుకున్నారు.

జగన్ పార్టీలోకి…..

ఈ క్రమంలోనే వైఎస్‌కు అనుకూలంగా పాట‌లు రాయ‌డం, షార్ట్ ఫిల్మ్‌లు తీయ‌డం ద్వారా .. 2004లో వైఎస్ అధికారంలోకి వ‌చ్చేందుకు ఉడ‌తా భ‌క్తి ప్రద‌ర్శించార‌ని క‌ర‌ణం ధ‌ర్మశ్రీ కి మార్కులు ఉన్నాయి. 2004లో మాడుగుల‌ ఎమ్మెల్యేగా గెలిచిన క‌ర‌ణం ఆ త‌ర్వాత వైఎస్ సూచ‌న‌ల మేర‌కే చోడ‌వ‌రంకు మ‌రారు. ఇదే ఆ త‌ర్వాత జ‌గ‌న్ రాజ‌కీయంగా పార్టీ పెట్టగానే ఆయ‌న‌తోనూ స‌న్నిహిత సంబంధాలు నెరిపారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేప‌డుతున్న అనేక ప‌థ‌కాల‌పై ల‌ఘు చిత్రాలు తీసి.. యూట్యూబ్ లో అప్‌లోడ్ చేయడంతోపాటు.. జ‌గ‌న్‌కు అనుకూలంగా పాట‌లు రాయడంలోనూ క‌ర‌ణం ధ‌ర్మశ్రీ ముందున్నారు.

ఆయన టార్గెట్ గా….

దీనికితోడు.. విశాఖ‌లో వివాద ర‌హిత నాయ‌కుడిగా.. ప్రజ‌ల‌ను క‌లుపుకొనిపోయే నాయ‌కుడిగా.. పార్టీ కోసం ప‌నిచేసే నేత‌గా కూడా క‌ర‌ణం ధ‌ర్మశ్రీ కి మంచి పేరుంది. ఇటీవ‌ల పార్టీలో ఆయ‌న టార్గెట్‌గా చిన్న ఇష్యూ జ‌రిగడం వెన‌క కూడా ఆయ‌న నిజాయితీని టార్గెట్ చేసే ప్రయ‌త్నమే అన్న ప్రచారం కూడా జ‌రిగింది. ఈ ప‌రిణామాలు అన్నీ ఇప్పుడు ఆయ‌న‌కు మంత్రి ప‌దవి తెచ్చే పెట్టే అవ‌కాశాల‌ను క‌ల్పించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్రస్తుతం మంత్రి వ‌ర్గ రేసులో ఉన్న నేత‌ల పేర్ల జాబితాలో క‌ర‌ణం ధ‌ర్మశ్రీ పేరు ఉంద‌ని అంటున్నారు.

Tags:    

Similar News