మంత్రిగారికి ఎస‌రు పెడుతున్న మ‌రో మంత్రి.. గుస‌గుస‌

ఒక మంత్రికి మ‌రో మంత్రి ఎస‌రు పెడుతున్నారంటూ.. పెద్ద ఎత్తున వైసీపీలో గుస‌గుస వినిపిస్తోంది. కొన్నాళ్లుగా ఈ ఇద్దరు మంత్రుల మ‌ధ్య వివాదం న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. [more]

Update: 2021-01-06 02:00 GMT

ఒక మంత్రికి మ‌రో మంత్రి ఎస‌రు పెడుతున్నారంటూ.. పెద్ద ఎత్తున వైసీపీలో గుస‌గుస వినిపిస్తోంది. కొన్నాళ్లుగా ఈ ఇద్దరు మంత్రుల మ‌ధ్య వివాదం న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, ఎదురు ప‌డిన‌ప్పుడు మాత్రం న‌వ్వుతూ ప‌ల‌క‌రించుకుని.. వెన‌క మాత్రం వెక్కిరించుకుంటున్నారు. దీంతో ఈ ఇద్దరు మంత్రుల విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. పార్టీలో కీల‌క నాయ‌కుడిగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి.. విజ‌య‌వాడకు చెందిన మంత్రికి ఎస‌రు పెడుతున్నార‌ని పెద్ద ఎత్తున ప్రచారం జ‌రుగుతోంది.

బెజవాడలో మంత్రి అనుచరులు….

వాస్తవానికి చిత్తూరుకు చెందిన మంత్రికి, విజ‌య‌వాడ‌కు చెందిన కీల‌క మంత్రికి మ‌ధ్య ఎందుకు వివాదం వ‌చ్చింది? ఆయ‌న ఈయ‌న‌కు ఎస‌రు పెట్టడం ఏంటి? అనే ప్రశ్న కీల‌కంగా మార‌డం ఖాయం. స‌ద‌రు సీమ మంత్రికి.. కోస్తా జిల్లాల్లో మంచి స‌న్నిహితులు ఉన్నారు. ఆయ‌న క‌నుస‌న్నల్లోనే పార్టీ న‌డుస్తోంది. ఇక్కడ ఆయ‌న మాట‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే.. రాను రాను.. విజ‌య‌వాడ మంత్రి వ‌ర్యుల క‌నుస‌న్నల్లోకి వ‌చ్చిన కొంద‌రు నాయ‌కులు ( ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయ‌న సామాజిక‌వ‌ర్గ నేత‌లు) ఇక్కడ స‌ద‌రు సీమ కు చెందిన మంత్రిని ఖాతరుచేయ‌డం లేదు. ఇది ఇరువురు మంత్రుల మ‌ధ్య ఒకింత ఆధిప‌త్యానికి దారితీసింది.

ఒకరిపై ఒకరు…?

పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో నేనే ముందున్నాను. ఇప్పటికి ముగ్గురిని పార్టీలోకి తీసుకువ‌చ్చాను.. అంతర్వేది వంటి ఘ‌ట‌న‌లు చెల‌రేగినా.. వ్యూహాత్మకంగా అడ్డుకున్నాను. అని స‌ద‌రు విజ‌య‌వాడ‌కు చెందిన మంత్రివ‌ర్యులు త‌న‌ను తానే పొగుడుకుంటున్నారు. మ‌రోవైపు.. ఇసుక, మ‌ద్యం విష‌యాల్లో ప్రభుత్వం ఇబ్బంది ప‌డుతోంద‌ని.. త‌ల ఎత్తుకోలేక పోతోంద‌ని ప‌రోక్షంగా వ్యాఖ్యలు సంధిస్తున్నారు. అంటే.. ఈ రెండు శాఖ‌లు సీమ‌కు చెందిన మంత్రి చేతిలోనే ఉన్నాయి. అంటే.. ప‌రోక్షంగా ఆయ‌న‌ను టార్గెట్ చేసుకున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. దీంతో సీమ మంత్రి.. ఫైర్ అయ్యార‌ని అంటున్నారు. మొత్తానికి జిల్లాలు మారి మ‌రీ.. మంత్రులు ఒక‌రిపై ఒక‌రు ఆధిప‌త్యం చలాయిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News