పూర్తిగా ద్వంసమైన టెర్రరిస్ట్ శిబిరాలు

లైన్ అఫ్ కంట్రోల్ వెంబడి బాలాకోట్, చకోటి, ముజఫరాబాద్ లలోని జైష్ ఏ మొహమ్మద్ టెర్రరిస్ట్ శిబిరాలు పూర్తిగా ద్వంసమైనట్లుగా తెలుస్తుంది. ఈ ఆపరేషన్ ఈ రోజు [more]

Update: 2019-02-26 04:27 GMT

లైన్ అఫ్ కంట్రోల్ వెంబడి బాలాకోట్, చకోటి, ముజఫరాబాద్ లలోని జైష్ ఏ మొహమ్మద్ టెర్రరిస్ట్ శిబిరాలు పూర్తిగా ద్వంసమైనట్లుగా తెలుస్తుంది.

ఈ ఆపరేషన్ ఈ రోజు ఉదయం 3:30 గంటలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 12 యుద్ధ విమానాలు పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. 1971 యుద్ధం తరువాత భారత యుద్ధ విమానాలు లైన్ అఫ్ కంట్రోల్ దాటడం ఇదే మొదటి సారి. జైష్ ఏ మహమ్మద్ కు సంబంధించిన కంట్రోల్ రూమ్స్ కూడా పూర్తిగా ద్వంసమైనట్లుగా తెలుస్తుంది.

నేషనల్ సెక్యూరిటీ అడ్వైసర్ అజిత్ దోవల్ ప్రధానమంత్రి మోడీ ని కలిసి దాడికి సంబంధించిన వివరాలు తెలియ జేసినట్లుగా తెలుస్తుంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు లైన్ అఫ్ కంట్రోల్ దాటినట్లుగా పాకిస్థాన్ కూడా ధృవీకరిస్తుంది కానీ , జరిగిన నష్టం పై ఎలాంటి ప్రకటన చేయలేదు.

Tags:    

Similar News