ఏ సీటులో ఎవరు గెలుస్తారో చెప్పిన ఇండియా టుడే సర్వే

ఆంధ్రప్రదేశ్ లో 18 లోక్ సభ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని అంచనా వేసిన ఇండియా టుడే – యాక్సిస్ మే నేషన్ సర్వే ఏ [more]

Update: 2019-05-21 08:56 GMT

ఆంధ్రప్రదేశ్ లో 18 లోక్ సభ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని అంచనా వేసిన ఇండియా టుడే – యాక్సిస్ మే నేషన్ సర్వే ఏ సీటులో ఎవరికి విజయావకాశాలు ఉన్నాయో ప్రకటించింది. 18 సీట్లు వైసీపీ గెలుస్తుందని ఈ సంస్థ అంచనా వేయగా, జనసేన విశాఖపట్నంలో గెలుస్తుందని తేల్చింది. ఇక, తెలుగుదేశం పార్టీ కచ్చితంగా ఒక్క స్థానాన్ని సైతం గెలుచుకుంటుందని ఈ సర్వే చెప్పలేదు. అయితే, ఆరుస్థానాల్లో మాత్రం టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీ ఉందని, వీటిల్లో ఎవరైనా గెలవవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది.

నియోజకవర్గం పార్టీ

అరకు వైసీపీ

విజయనగరం వైసీపీ

విశాఖపట్నం జనసేన

అనకాపల్లి వైసీపీ

కాకినాడ వైసీపీ

అమలాపురం వైసీపీ

రాజమండ్రి వైసీపీ

నర్సాపురం వైసీపీ

ఏలూరు వైసీపీ

నరసరావుపేట వైసీపీ

బాపట్ల వైసీపీ

ఒంగోలు వైసీపీ

నంద్యాల వైసీపీ

కర్నూలు వైసీపీ

హిందూపురం వైసీపీ

కడప వైసీపీ

నెల్లూరు వైసీపీ

తిరుపతి వైసీపీ

రాజంపేట వైసీపీ

శ్రీకాకుళం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అనంతపురం, చిత్తూరు లోక్ సభ స్థానాల్లో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉందని ఈ సర్వే అంచనా వేసింది.

Tags:    

Similar News