నోటి దురద కొంపముంచింది !!

పెదవి దాటని మాటకు ప్రభువు నీవు. పెదవి దాటిన మాటకు బానిసవు నీవు అని పెద్దలు చెబుతూ వుంటారు. పెదవి దాటిన మాట ఇప్పుడు ఇద్దరు ఇండియన్ [more]

Update: 2019-01-12 02:30 GMT

పెదవి దాటని మాటకు ప్రభువు నీవు. పెదవి దాటిన మాటకు బానిసవు నీవు అని పెద్దలు చెబుతూ వుంటారు. పెదవి దాటిన మాట ఇప్పుడు ఇద్దరు ఇండియన్ టాప్ క్రికెటర్ల కొంప ముంచేసింది. టీం ఇండియా లో కీలక పాత్ర పోషించే ఆల్ రౌండర్ హార్దిక పాండ్య, ఓపెనర్ కె ఎల్ రాహుల్ లపై సస్పెన్షన్ వేటుపడింది. ఒక టివి షోలో వీరిద్దరూ మహిళలను కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేయడమే ఈ దుమారానికి కారణం కావడం తీవ్ర చర్చనీయాంశం గా మారింది.

అసలు ఏం జరిగింది …?

ఇంతకి అసలు ఏమి జరిగింది అంటే ? ఇటీవల కె ఎల్ రాహుల్, హార్దిక పాండ్య లు ఇద్దరు కాఫీ విత్ కరణ్ జోహార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ షో లో మహిళలపై వీరిద్దరూ అసభ్యంగా వ్యాఖ్యలు చేశారు. షో తరువాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజెన్స్ వీరి వైఖరిపై దుమ్మెత్తిపోశారు. దాంతో బిసిసిఐ రంగంలోకి దిగింది. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిసిసిఐ పాలకమండలి సభ్యురాలు డయానా పోరాటం చేసి వీరిని సస్పెండ్ చేసేలా పట్టుబట్టారు. దాంతో రెండు వన్డేల్లో వీరిద్దరూ మ్యాచ్ ల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. వాస్తవానికి వీరిపై చర్యలకు బిసిసిఐ కు అధికారం లేకపోయినా ప్రజల నుంచి వచ్చిన నిరసన సెగ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారం పై పాండే ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. ఇదిలా ఉంటే ఈ వివాదం పై టీం ఇండియా కెప్టెన్ కోహ్లీ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని తేల్చేశారు.

Tags:    

Similar News