బ్రేకింగ్ : ఆ నలుగురినీ కాల్చిచంపేశారు

దిశ హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసినట్లు తెలిసింది. షాద్ నగర్ వద్ద పోలీసులు కళ్లుగప్పి పారిపోవడానికి ప్రయత్నించిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్ [more]

Update: 2019-12-06 02:11 GMT

దిశ హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసినట్లు తెలిసింది. షాద్ నగర్ వద్ద పోలీసులు కళ్లుగప్పి పారిపోవడానికి ప్రయత్నించిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసినట్లు తెలుస్తోంది. సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయడానికి నిందితులను షాద్ నగర్ లోని సంఘటన స్థలికి పోలీసులు విచారణలో భాగంగా తీసుకువచ్చారు. అయితే నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్న కేశవులు పోలీసు కస్టడీ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా ఎన్ కౌంటర్ చేసినట్లు తెలిసింది. నలుగురు నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు. దిశను షాద్ నగర్ ప్రాంతంలోనే నిందితులు కిడ్నాప్, అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. గత నెల 27వ తేదీన దిశ హత్య జరిగిన సంగతి తెలిసిందే. దిశ హత్య కేసులో ఏడు పోలీసు ప్రత్యేక బృందాలను నియమించింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ సంఘటనలో పోలీసులు నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేశారు.

Tags:    

Similar News