నమ్మాలి తల్లీ… నమ్మక పోతే ఇక అంతే?

సహజంగా ఏ రాష్ట్రంలోనైనా పార్టీ బలంగా ఉండాలంటే అక్కడ నాయకత్వం బలంగా ఉండాలి. నాయకుడు బలంగా ఉంటేనే అక్కడ పార్టీ బలంగా ఉంటుంది. కాంగ్రెస పార్టీ తొలి [more]

Update: 2021-02-02 18:29 GMT

సహజంగా ఏ రాష్ట్రంలోనైనా పార్టీ బలంగా ఉండాలంటే అక్కడ నాయకత్వం బలంగా ఉండాలి. నాయకుడు బలంగా ఉంటేనే అక్కడ పార్టీ బలంగా ఉంటుంది. కాంగ్రెస పార్టీ తొలి నుంచి చేస్తున్న తప్పు ఆ పార్టీ కొంప ముంచేట్లు ఉంది. ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గాంధీ కుటుంబంలో ఎవరైనా సరే రాష్ట్రంలో బలమైన నాయకుడిని ఎవరినీ ఎదగనివ్వరు. అయితే ఇందిర కు ఉండే ఇమేజ్ తో కొన్ని ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయగలిగింది.

బలహీనం కావడానికి….

కానీ సోనియా గాంధీ హయాంలో మాత్రం కాంగ్రెస్ మరింత బలహీనం కావడానికి రాష్ట్రాల్లో నాయకత్వ లోపమే కారణమని చెప్పాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకుడు కారణంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు పార్టీ అధికారంలోకి రాగలిగింది. అటువంటిది ఆయన తనయుడు జగన్ ను దూరం చేసుకున్న తర్వాత ఇప్పుడు పార్టీకి నాయకత్వ సమస్య ఏర్పడింది. ఇక కర్ణాటకలోనూ సిద్ధరామయ్య ఒంటిచేత్తో పార్టీని నడుపుతున్నారు. ఆయనను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

ఏ రాష్ట్రంలోనూ…..

ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ కు నాయకత్వం లేదు. తమిళనాడును తీసుకుంటే అక్కడ చిదంబరం వంటి నేతలున్నా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే కనపడతారు. తమిళనాడు రాజకీయాలను పట్టించుకోరు. అటువంటి వారినే కాంగ్రెస్ ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు అక్కడ డీఎంకే దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇక పశ్చిమ బెంగాల్ లోనూ అంతే. బలమైన నేతగా భావించి మమత బెనర్జీని కాంగ్రెస్ దూరం పెట్టింది. దీంతో ఆమె వేరే పార్టీ పెట్టుకుని రెండు సార్లు అధికారంలోకి రాగలిగారు.

నమ్మకం లేకనే….?

కేరళలోనూ అంతే. ఉమెన్ చాందీ వంటి నేతలున్నా ఫైర్ బ్రాండ్ లుగా పేరుపడిన నేతలు ఎవరూ లేరు. ఉత్తర్ ప్రదేశ్ లోనూ అంతే. సరైన నాయకుడు లేకపోవడంతో ప్రియాంక గాంధీని రంగంలోకి దించాల్సి వచ్చింది. చరిష్మా, ప్రజల్లో పట్టున్న నేతకు పార్టీ పగ్గాలు అప్పగిస్తేనే కాంగ్రెస్ రాష్ట్రాల్లో పుంజకుంటుందన్న విషయం అనేక సార్లు రుజువయినా, పార్టీ అధిష్టానం మాత్రం పట్టించుకోదు. ఇదే అసలు సమస్యగా మారింది. దీంతో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కన్పించకుండా పోయింది. ఇప్పటికైనా బలమైన నాయకుడిని ముందు తాము నమ్మి జనంలోకి పంపాలన్నది క్యాడర్ కోరుకుంటుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ హైకమాండ్ ఆ దిశగా ఆలోచిస్తేనే తిరిగి పార్టీకి పూర్వ వైభవం దక్కుతుంది.

Tags:    

Similar News