భయపడిపోతూ పాలించాలంట

టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు వింటుంటే ముఖ్యమంత్రులు ఎవరైనా తనకు భయపడాల్సిందేనన్నట్లుగా ఉంది. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రులు ఎవరైనా తనకు భయపడాల్సిందేనంటున్నారు చంద్రబాబు. గతంలో వైఎస్ [more]

Update: 2020-01-02 12:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు వింటుంటే ముఖ్యమంత్రులు ఎవరైనా తనకు భయపడాల్సిందేనన్నట్లుగా ఉంది. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రులు ఎవరైనా తనకు భయపడాల్సిందేనంటున్నారు చంద్రబాబు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తనంటే భయపడే వారని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అంటే చంద్రబాబుకు ముఖ్యమంత్రులు భయపడుతూ పనిచేసుకోవాల్సిందేనా? అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో పడుతున్నాయి. జగన్ ను భయపెట్టాలని పిలుపునిస్తున్నారు చంద్రబాబు.

ఇన్ సైడర్ ట్రేడింగ్…..

నిజానికి రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి అనేక మంది టీడీపీ నేతల పేర్లు చదివి విన్పించారు. ఇందులో యనమల రామకృష్ణుడు అల్లుడి దగ్గర నుంచి ఎన్ఆర్ఐ వేమూరి రవి వరకూ ఉన్నారు. మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వారిలో ఉన్నారు. అయితే వీరెవ్వరూ తాము భూములు కొనుగోలు చేయలేదని చెప్పడం లేదు. తాము భూములు కొన్న మాట వాస్తవమేనని, కానీ అది ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదని అంటున్నారు.

కులాలు లేవంటూనే…..

అయితే దీనిపై చంద్రబాబు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని కోరుతున్నారు. సీబీఐకి ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. అమరావతిలో ఒక కులం వారు లేరని అందరూ జీవనం సాగిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. గ్రామాలన్న తర్వాత అన్ని కులాలు, మతాలు ఉండటం సహజం. ఇది మన సంస్కృతికి నిదర్శనం. అయితే అక్కడ పెత్తందార్లు ఎవరు? భూ యజమానులు ఎవరు? అన్నదే ప్రశ్న. దానిని దాటవేస్తూ చంద్రబాబు జగన్ తనకు భయపడాల్సిందేనని చెబుతున్నారు.

సోషల్ మీడియాలో సెటైర్లు…

జగన్ ముఖ్యమంత్రిగా ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆందోళన కొన్ని ప్రాంతాలకే పరిమితమయింది. ఐదు కోట్ల మందిని ఏకం చేయాలని చంద్రబాబు అనుకున్నా అది సాధ్యమయ్యే పరిస్థితి కాదన్నది అందరికీ తెలసిందే. పార్టీలోనే భిన్న వాదనలు తలెత్తుతున్న నేపథ్యంలో అమరావతిని ఏవిధంగా కాపాడుకోవాలన్న దానిపై చంద్రబాబు అన్ని రకాలుగా ప్రయత్నిస్తారన్న సంగతి అందరికీ తెలిసినా జగన్ తనకు భయపడాల్సిందేనని అంటుండటం, తాను చెప్పిందే జగన్ చేయాలని అంటుండం కొంచెం విచిత్రంగా కన్పిస్తుంది. దీనిపై వైసీపీ నేతలు కూడా సెటైర్లు వేస్తున్నారు. 151 మంది ఎమ్మెల్యేలున్న జగన్ భయపడి పోయి సలాం చేస్తే గాని చంద్రబాబు శాంతించరేమోనని ఎద్దేవా చేస్తున్నారు.

Tags:    

Similar News