అందుకే తిరుపతి ఎన్నికలో ఆ పనిని వారికి అప్పగించారా?

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వైసీపీ మెజారిటీని తగ్గించడమే చంద్రబాబు లక్ష్యం. గెలుపోటముల సంగతి పక్కన పెట్టి వైసీపీకి గతంలో వచ్చిన మెజారిటీ [more]

Update: 2021-04-06 00:30 GMT

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వైసీపీ మెజారిటీని తగ్గించడమే చంద్రబాబు లక్ష్యం. గెలుపోటముల సంగతి పక్కన పెట్టి వైసీపీకి గతంలో వచ్చిన మెజారిటీ కంటే తగ్గించాలన్నదే చంద్రబాబు లక్ష్యం. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో డబ్బుది కూడా ప్రధాన పాత్ర కానుంది. అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టనుంది. దీంతో చంద్రబాబు నిధుల సమీకరణ బాధ్యతలను వారిద్దరికి అప్పగించారన్న టాక్ పార్టీలో నడుస్తుంది.

నిధుల కొరత ఏమీ లేకున్నా…..

నిజానికి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు తెలుగుదేశం పార్టీకి నిధుల కొరత ఏమీ లేదు. కేంద్ర పార్టీ వద్ద దండిగా నిధులున్నాయి. అయితే ఓటమి పాలయ్యే ఉప ఎన్నిక కోసం ఖర్చు చేయడానికి చంద్రబాబు ఇష్టపడటం లేదు. అందుకే తిరుపతి ఉప ఎన్నికకు నిధుల సమీకరించాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రధానంగా ఈ బాధ్యతలను నెల్లూరు జల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదరవిచంద్ర యాదవ్ లకు అప్పగించినట్లు తెలిసింది.

తాను భరించలేనంటూ….

పనబాక లక్ష్మి తనను అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించినప్పుడే ఎన్నికల ఖర్చు తాను భరించలేనని చెప్పారు. ఎన్నికల్లో నిధులన్నీ పార్టీ చూసుకుంటుందంటేనే తాను బరిలో నిలుస్తానని, గత ఎన్నికల్లోనే తాను ఖర్చు చేశానని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని ఆమె చెప్పారు. అయితే ఎన్నికల ఖర్చు మొత్తం పార్టీ యే పెట్టుకుందని నాడు చంద్రబాబు ఆమె కు భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకూ నిధులు ఏవీ విడుదల చేయకపోవడంతోనే పనబాక లక్ష్మి ప్రచారం చేయలేదన్న కామెంట్స్ కూడా విన్పిస్తున్నాయి.

నిధుల సేకరణకు…..

దీనికి సంబంధించి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లో ఉన్న టీడీపీ సానుభూతిపరులు, పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలను సేకరించాలని నిర్ణయించార. ఈ బాధ్యతలను చంద్రబాబు సోమిరెడ్డి, రవిచంద్రయాదవ్ లకు అప్పగించారు. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన నేతలకు తిరుపతి ఎన్నిక బాధ్యతను అప్పగించడాన్ని చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. ప్రధానంగా మాజీమంత్రి అమర్ నాధ్ రెడ్డి వంటి వారు గుస్సాగా ఉన్నారని తెలుస్తోంది. మొత్తంమీద చంద్రబాబు తిరుపతి ఎన్నికల్లో టీడీపీ కి ఆర్థిక కష్టాలు లేకుండా సీినియర్ నేతలను రంగంలోకి దించారు.

Tags:    

Similar News