బాబులో ఆ భరోసా అందుకేనా?

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ఇప్పుడు అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారింది. అన్ని పార్టీలూ ఈ ఎన్నికలో గెలవాలని చూస్తున్నాయి. ఈ ఎన్నికలో గెలిస్తేనే ఆ యా [more]

Update: 2020-12-27 15:30 GMT

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ఇప్పుడు అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారింది. అన్ని పార్టీలూ ఈ ఎన్నికలో గెలవాలని చూస్తున్నాయి. ఈ ఎన్నికలో గెలిస్తేనే ఆ యా పార్టీలలో మళ్లీ జోష్ వస్తుంది. అందుకే అన్ని పార్టీలూ తిరుపతి వైపే చూస్తున్నాయి. ప్రధానంగా వైసీసీ అధికారంలో ఉంది కాబట్టి, సిట్టింగ్ సీటు తమదే కాబట్టి ఖచ్చితంగా గెలుచుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి కూడా ఈ ఎన్నిక ఊపిరి పోస్తుందని చెప్పాలి.

ఇక్కడ గెలిస్తే….

తిరుపతి ఉప ఎన్నికలో గెలిస్తే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోతాయనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తాను బీజేపీతో కలసి నడవాలని భావిస్తున్నారు. అందుకే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కూటమితో కలసి నడిచిన చంద్రబాబు గత రెండేళ్లుగా అటువైపు చూడటం లేదు. కనీసం ఢిల్లీ గడప కూడా తొక్కలేదు. బీజేపీతో వెళితేనే తనకు ప్లస్ అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. గతంలో తాను గెలిచింది కూడా బీజేపీతో పొత్తుపెట్టుకున్నప్పుడే.

పొత్తుకోసం…..

అందుకే చంద్రబాబు బీజేపీతో పొత్తుకోసం ఆరాట పడుతున్నారు. కానీ రాష్ట్ర స్థాయిలో నేతలు టీడీపీతో పొత్తు కు అంగీకరించడం లేదు. జాతీయ స్థాయి నేతలు కొంత సుముఖంగా ఉన్నప్పటికీ ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం పొత్తుకు ససేమిరా అంటున్నారు. అయితే తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలతో వారి వైఖరిని మార్చవని చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారు. తిరుపతిలో టీడీపీ గెలిచిన తర్వాత పవన్ కల్యాణ‌్ కూడా టీడీపీతో పొత్తుకు సిద్దమవుతారంటున్నారు.

ఎలాగైనా గెలిచి…..

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా ఒక ఉప ఎన్నికకు వ్యూహకర్తను బరిలోకి దించారంటున్నారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని చంద్రబాబు భావిస్తున్నారు. సంక్షేమ పథకాలు తప్పించి అభివృద్ధి గత 19 నెలలుగా ఏమీ లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని గుర్తించారు. అందుకే ఈ ఎన్నికలో గెలుపు ద్వారా ఇటు జగన్ ను దెబ్బకొట్టడమే కాకుండా, అటు బీజేపీని కూడా తన దారికి తెచ్చుకోవచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News