బీజేపీ మహా ముదురు… అందరికీ ఆశలు ?

బీజేపీ అన్ని రాజకీయ పార్టీల కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్లుంది. హామీలు కూడా కోటలు దాటేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు జరిగి గట్టిగా ఏడాదిన్నర కాలేదు వచ్చే [more]

Update: 2020-12-17 15:30 GMT

బీజేపీ అన్ని రాజకీయ పార్టీల కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్లుంది. హామీలు కూడా కోటలు దాటేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు జరిగి గట్టిగా ఏడాదిన్నర కాలేదు వచ్చే ఎన్నికల కోసం టికెట్ కౌంటర్ ని బీజేపీ ఓపెన్ చేసేసింది అని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. హాట్ ఫేవరేట్ సీట్లను ముందుచి మరీ బడా నేతలకు గేలం వేస్తోంది. ఇక ఒకే సీటు విషయంలో ఇద్దరు ముగ్గురు నేతలకు బీజేపీ నుంచి హామీలు వెళ్తూండడం ఆ పార్టీ అమలు చేస్తున్న ముదురు రాజకీయంగా ఉంది.

ఆయన వస్తే అలా…..

విశాఖ నుంచి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి రెండున్నర లక్షలకు పైగా ఓట్లను తెచ్చుకున్న మాజీ సీబీఐ అధికారి జేడీ లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లోనూ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేద్దామనుకుంటున్నారు. ఆయనను బీజేపీలోకి తెచ్చి పోటీ చేయిస్తే గెలుపు గ్యారంటీ అని ఆ పార్టీ భావిస్తోంది అని ఓ వైపు వినిపిస్తున్న మాట. ఆయన కూడా అందుకు సుముఖంగా ఉన్నారని అంటున్నారు. ఇపుడు సడెన్ గా ఈ సీటు విషయంలో మరో పేరు బీజేపీ నుంచే వినిపిస్తోందిట.

గంటాకు హామీ…..

వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ని బీజేపీ రెడీ చేస్తోందని ఇంకో వైపు నుంచి వినిపిస్తున్న మాట. విశాఖ పార్లమెంట్ పరిధిలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాపులకు మంచి బలం ఉంది. అందువల్ల ఆ సామాజికవర్గం బలం, గంటావ్యక్తిగత ఇమేజ్, బీజేపీకి ఉన్న పట్టు ఇవన్నీ కలిస్తే విశాఖ లోక్ సభ సీటుని బంపర్ మెజారిటీతో కొడతామని కమలనాధులు భావిస్తున్నారుట. అందుకోసం గంటాను ఇప్పటినుంచే దువ్వుతున్నారని టాక్.

ఆమె కూడా రెడీనా..?

ఇక ఈ మధ్యనే బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్న కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కన్ను కూడా విశాఖ మీదనే ఉంది. ఆమె 2009 ఎన్నికల్లో ఇక్కడ నుంచే గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడినా కూడా 2024 నాటికి తనకు సేఫెస్ట్ సీటు ఇదేనని ఆమె భావిస్తున్నారు. పార్టీలోని ఒక వర్గం కూడా పురంధేశ్వరి విశాఖ నుంచి బరిలో ఉంటారని చెబుతోంది. ఇక ఆమె సామాజిక వరం పలుకుబడి గట్టిగా ఉంది. రాజకీయంగా ఎక్కువ సార్లు కమ్మలు గెలుచుకున్న సీటు ఇది. దాంతో ఈ సీటు వదులుకోరాదని బీజేపీలోని ఆ వర్గం కూడా భావిస్తోందిట. మొత్తానికి బీజేపీ ఇలా హాట్ ఫేవరేట్ సీట్లను చూపించి నేతలకు గేలం వేయడంతో కాషాయ రాజకీయాలలో కొత్త కలకలం రేగుతోంది.

Tags:    

Similar News