సైకిల్ “బ్రదర్స్” చెరో దారి

నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ కీల‌క నాయ‌కులు, స్వయానా సోద‌రులు బీద ర‌విచంద్రయాద‌వ్‌.. బీద మస్తాన్‌రావు. ప్రస్తుతం బీద ర‌విచంద్ర నెల్లూరుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు. [more]

Update: 2019-12-02 09:30 GMT

నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ కీల‌క నాయ‌కులు, స్వయానా సోద‌రులు బీద ర‌విచంద్రయాద‌వ్‌.. బీద మస్తాన్‌రావు. ప్రస్తుతం బీద ర‌విచంద్ర నెల్లూరుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు. టీడీపీలో కీల‌క నాయకులుగా ఎదిగిన వీరు అనేక ప‌ద‌వులు కూడా అనుభవించారు. అయితే, ఇప్పుడు ఈ సోద‌రుల మ‌ధ్య రాజ‌కీ యంగా ఎవ‌రిదారి వారిదే అనే వ్యాఖ్యలు వినిపిస్తు న్నాయి. మ‌స్తాన్ రావు.. ప్రముఖ వ్యాపార సంస్థ బీఎంఆర్‌ను నిర్వహిస్తున్నారు. రియ‌ల్ ఎస్టేట్, ఆక్వా ఎక్స్ పోర్ట్ వంటి స‌హా వివిధ పనులు చేస్తున్నారు. రాజ‌కీయంగా త‌న‌కు ఉన్న ప‌లుకుబడిని ఆయ‌న వాడుకుంటున్నారు.

ఎంపీగా పోటీ చేసి….

అయితే, ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి త‌ర్వాత రాజ‌కీయంగా బీద సోద‌రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు మొత్తం వైసీపీ కంచుకోట‌గా మారిపోయింది. టీడీపీ ఒక్క చోట కూడా విజ‌యం సాధించ‌లేదు. ఎవ‌రూ కూడా ప్రభుత్వానికి వ్యతి రేకంగా ప‌నిచేసే నాయ‌కుడు, విమర్శించే నాయ‌కుడు కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అదే స‌మయంలో వ్యాపారాలు, వ్యవ‌హారాల్లో ఉన్న నాయకులు అయితే, వైసీపీకి ట‌చ్‌లో లేకుండా ప‌నులు జ‌రిగే అవ‌కాశం లేదు. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో బీద మ‌స్తాన్ రావు టీడీపీ త‌ర‌ఫున నెల్లూరు ఎంపీగా పోటీ చేశారు. భారీ ఎత్తున గెలుపు కోసం కృషి చేశారు. అయితే, వైసీపీ హ‌వాలో ఓడిపోయారు.

అంటీ ముట్టనట్లే….

ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు బీఎంఆర్ సంస్థల‌పై ఐటీ దాడులు జ‌రిగాయి. వాటి కేసులు ప్రస్తుతం న‌డుస్తు న్నాయి. మ‌రికొన్ని బ్యాంకు లావాదేవీలు కూడా నిలిచిపోయిన‌ట్టు తెలుస్తోంది దీంతో ఆర్థికంగా బీద మ‌స్తాన్ రావు ఇబ్బందుల్లో ఉన్నార‌ని అంటున్నారు. మ‌రోప‌క్క జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా ఉన్న బీద ర‌విచంద్రయాదవ్ ఉన్నా ముఖ్యమైన నిర్ణయాలు మాత్రం రెడ్డి సామాజిక వ‌ర్గం ఆధిప‌త్యానికే చంద్రబాబు వ‌దిలేశారని, బీద సోద‌రుల్లో ఆవేద‌న ఉంది. పైగా ఐటీ దాడుల స‌మ‌యంలోనూ పార్టీ పెద్దగా త‌మ‌కు హెల్ప్ చేయ లేద‌నే భావ‌న కూడా ఉంది. ఈ నేప‌థ్యంలో ఇద్దరూ కూడా ఇప్పుడు పార్టీలో అంటీ ముట్టన‌ట్టే ఉంటున్నారు.

మంత్రి అనిల్ తోనూ….

అయితే, ర‌విచంద్ర యాద‌వ్ ఎమ్మెల్సీ కావ‌డంతో ఆయ‌న పార్టీలోనే ఉన్నా.. మ‌స్తాన్ రావు మాత్రం వైసీపీ వైపు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయ‌న వ్యాపారాలు అన్నీ కూడా ప్రభుత్వ క‌టాక్షంపైనే ఆధార‌ప‌డి ఉన్న నేప‌థ్యంలో వైసీపీకి ఇప్పటికే ఆయ‌న సానుకూలంగా మారిపోయార‌నే వార్తలు గుప్పుమంటున్నాయి. మంత్రి అనిల్‌తోనూ మ‌స్తాన్‌రావు ట‌చ్‌లో ఉంటున్నార‌ని అంటున్నారు. సామాజిక‌వ‌ర్గ నేప‌థ్యంలోనూ వీరు ఒక్కటయ్యార‌న్న చ‌ర్చలు వ‌స్తున్నాయి. ఇదిలావుంటే, జిల్లాలో టీడీపీ ప‌రిస్థితి కూడా బ్యాడ్‌గానే ఉంది. ఈ నేప‌థ్యంలో ఇక‌, పార్టీలో ఉండి కూడా ప్రయోజ‌నం లేద‌నే భావ‌న మ‌స్తాన్ రావులో ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో త్వర‌లోనే ఆయ‌న వైసీపీ వైపు జంప్ చేసే అవ‌కాశం ఉంద‌ని ప్రచారం జ‌రుగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News