బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ జగన్ దే.. జాతీయ మీడియా సర్వే..!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తిరుగులేని విజయం సాధించబోతున్నారని జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ అంచనా వేసింది. పోల్ [more]

Update: 2019-01-30 13:23 GMT

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తిరుగులేని విజయం సాధించబోతున్నారని జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ అంచనా వేసింది. పోల్ ట్రాకర్ పేరుతో వీవీఆర్ సంస్థతో కలిసి చేసిన సర్వే వివరాలను ఇవాళ ఆ ఛానల్ ప్రకటించింది. ఆంద్రప్రదేశ్ లో జగన్ హవా వేస్తోంది.. జగన్ క్లీన్ స్వీప్ చేయబోతున్నారని స్పష్టం చేసింది. మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 23 స్థానాలను గెలుచుకోబోతోందని టైమ్స్ నౌ అంచనా వేసింది. ఇక, అధికార తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిననుందని, కేవలం 2 పార్లమెంటు స్థానాలు మాత్రమే గెలుస్తుందని అంచనా వేసింది. వైసీపీ, టీడీపీకి మధ్య ఓట్ల శాతం కూడా భారీగా తేడా ఉన్నట్లు ఈ సర్వే అంచనా వేసింది. వైసీపీ ఏకంగా 49.5 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉండగా.. టీడీపీ 36 శాతం ఓట్లు మాత్రమే సాధిస్తుందని, కాంగ్రెస్ 2.5 శాతం, బీజేపీ 4.8 శాతం ఓట్లు సాధిస్తుందని అంచనా వేసింది.

Tags:    

Similar News