అచ్చెన్న వెర్సెస్ కూన … అసలు ఏమైంది ?

మంత్రి అచ్చెన్నాయుడుకు చెమటలు పట్టించారు విప్ కూన రవి. ఇద్దరు అధికార పార్టీ అయినప్పటికీ అసెంబ్లీ సాక్షిగా అధికార విపక్షాలు గా తలపడ్డారు. బిసి సబ్ ప్లాన్ [more]

Update: 2019-02-09 02:30 GMT

మంత్రి అచ్చెన్నాయుడుకు చెమటలు పట్టించారు విప్ కూన రవి. ఇద్దరు అధికార పార్టీ అయినప్పటికీ అసెంబ్లీ సాక్షిగా అధికార విపక్షాలు గా తలపడ్డారు. బిసి సబ్ ప్లాన్ బిల్లు అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన సందర్భంలో జరిగిన చర్చ ఇప్పుడు ఎపి లో హాట్ టాపిక్ అయ్యింది. తూతూ మంత్రంగా బిసి సబ్ ప్లాన్ ప్రవేశ పెట్టారనే రీతిలో కూన రవి పదేపదే మంత్రి బిల్లు పై చేస్తున్న ప్రసంగానికి అడ్డు తగిలి ప్రశ్నల వర్షం కురిపించి అచ్చెన్నను ఉక్కిరి బిక్కిరి చేశారు. రవికి పలువురు ఎమ్యెల్యేలు మద్దత్తు పలికితే అచ్చెన్నకు బాసటగా మంత్రి పితాని సత్యనారాయణ కొంత ప్రయత్నం చేసినా స్పీకర్ కోడెల సభ్యుల పక్షానే నిలవడంతో అధికార పార్టీ ఇరుకున పడి పరువు పోగొట్టుకుంది. బిజెపి శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సైతం అధికార పార్టీ తప్పుల తడక బిల్లు ప్రవేశ పెట్టేకన్నా ప్రిపేర్ అయ్యి శుక్రవారం ప్రవేశ పెట్టమని సలహా ఇవ్వడంతో కొంత సేపు సభ సైలెంట్ అయ్యింది.

కూన అడిగింది ఇదే …

బిసి సంక్షేమ మంత్రి అచ్చెన్నాయుడును వాస్తవానికి విప్ కూన రవి అడిగింది బిసి సబ్ ప్లాన్ కి నిధులు ఎలా విడుదల చేస్తారో చెప్పాలనే. అయితే జనాభా ప్రాతిపదికన చేస్తామని మంత్రి చెప్పడం నిధులే లేకుండా ఎలా చేస్తారంటూ రవి నిలదీయడం అచ్చెన్న ను డిఫెన్స్ లో పడెల చేసింది. బిసి జనాభా ప్రాతిపదికన చేస్తారా లేక రిజర్వేషన్ శాతాన్ని బట్టి చేస్తారా అంటూ కడిగేశారు. దీనిపై అచ్చెన్న నీళ్ళు నమిలారు. రవితో బాటు పలువురు ఎమ్యెల్యేలు ఇవే ప్రశ్నలు సంధించడం ఆయనను చికాకు పెట్టింది. దాంతో బిల్లు పై న్యాయ సమీక్ష తరువాత ప్రవేశ పెడతానని చెప్పడంతో స్పీకర్ సైతం అంగీకరించారు. విషయం ముఖ్యమంత్రి కి చేరడంతో రవిని పిలిచి తనదైన క్లాస్ ఇచ్చారు. జిల్లాల్లో గొడవను అసెంబ్లీ కి తెచ్చి పార్టీ పరువు పోయే పనులు చేయొద్దంటూ వ్యవహారం అచ్చెన్న, కూన ల మధ్య ఉన్నట్లు తెలివిగా డైవర్ట్ చేయడం గమనార్హం. దాంతో బాటు అధికారులతో చర్చించడంతో బిల్లులో లోపం ఉన్నట్లు తేలింది. ఆమోదం ఆలస్యం అయితే పరువు పోతుందని గ్రహించి మధ్యాహ్నం సెషన్ లో తిరిగి ప్రవేశ పెట్టి మమ అనిపించి ఊపిరి పీల్చుకుంది అధికార పార్టీ.

Tags:    

Similar News