ఆసియా కప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడబోయే భారత జట్టు ఇదేనా..?

టీమ్ ఇండియా ఆసియా కప్-2022లో మొదటి మ్యాచ్ లో భాగంగా పాకిస్థాన్‌తో తలపడనుంది.

Update: 2022-08-28 02:58 GMT

టీమ్ ఇండియా ఆసియా కప్-2022లో మొదటి మ్యాచ్ లో భాగంగా పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆగస్ట్ 28 (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. మ్యాచ్‌కు ముందు రెండు జట్లు ప్రాక్టీస్ సెషన్‌లలో పాల్గొన్నాయి. ఇక ఈరోజు మ్యాచ్ ఆడబోయే జట్టు గురించి బీసీసీఐ ముందుగానే హింట్స్ ఇచ్చిందని అంటున్నారు భారత అభిమానులు. శుక్రవారం నాడు భారత క్రికెట్ జట్టు అధికారిక ట్విట్టర్ ఖాతాలో వరుసగా ఫోటోలను అప్‌లోడ్ చేసింది. పాక్ పై మెన్ ఇన్ బ్లూ ప్లేయింగ్ XI గురించి హిట్ ఇచ్చిందని అంటున్నారు. పది చిత్రాలతో ఉన్న పోస్ట్ లో KL రాహుల్, కెప్టెన్ రోహిత్ శర్మ కలిసి ఉన్నారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్, దీపక్ హుడా ఈ పోస్ట్‌లో కనిపించలేదు.

ఆసియా కప్ కోసం భారత్ సెలెక్ట్ చేసిన ప్రాబబుల్స్ లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్, దీపక్ హుడా వంటి వారు కూడా ఈ పోస్ట్‌లో లేరు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. పాకిస్థాన్ బృందం కూడా 11 మందిని సెలెక్ట్ చేయడానికి చాలా కష్టాలు పడుతోంది. గాయం కారణంగా ఏస్ పేసర్ షాహీన్ అఫ్రిదిని పాక్ కోల్పోయింది. టీమిండియా కూడా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ సేవలను కోల్పోయింది.



Tags:    

Similar News