మ్యాచ్ తర్వాత జడేజాతో మాట్లాడిన సంజయ్ మంజ్రేకర్.. ఫుల్ కామెడీ..!

గతంలో సంజయ్ మంజ్రేకర్ రవీంద్ర జడేజాను విమర్శిస్తూ పలు కామెంట్లు చేశారు.

Update: 2022-08-29 03:40 GMT

టీమిండియా పాకిస్థాన్ పై ఆసియా కప్ లో మంచి విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో విజయానికి రవీంద్ర జడేజా నిలకడగా ఆడడం కూడా ఒక కారణమే..! ఆఖర్లో భారీ షాట్ కొట్టాలని వెళ్లి జడేజా అవుట్ అయ్యాడు కానీ.. పాండ్యాతో కలిసి మ్యాచ్ ను ముగించే వాడే. ఇక మ్యాచ్ అనంతరం ప్రముఖ కామెంట్రేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో మాట్లాడాడు. అయితే మాట్లాడే ముందు ఒక ఊహించని ప్రశ్నను సంజయ్ మంజ్రేకర్ జడేజాను అడగడం విశేషం. 'నీకు నాతో మాట్లాడడానికి పెద్ద సమస్య ఏమీ లేదు కదా..?' అని సంజయ్ మంజ్రేకర్ అడగడం విశేషం.

బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్థాన్‌ను ఐదు వికెట్ల తేడాతో భారత జట్టు ఓడించింది. జడేజా 35 పరుగులు చేయడంతో టీమ్ ఇండియా తరఫున విరాట్ కోహ్లీతో కలిసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మంజ్రేకర్ మ్యాచ్ తర్వాత ఆల్ రౌండర్‌ని ఇంటర్వ్యూ చేశారు. మంజ్రేకర్ జడేజాను అడిగిన మొదటి విషయం ఏమిటంటే, "మీరు నాతో మాట్లాడటానికి ఓకే నా, జడ్డూ?" మంజ్రేకర్ అడిగాడు. దానికి భారత ఆల్ రౌండర్ నవ్వుతూ, "యా, అవును, ఖచ్చితంగా" అని బదులిచ్చాడు. పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిన తర్వాత జడేజా, మంజ్రేకర్‌లు మాట్లాడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో సంజయ్ మంజ్రేకర్ రవీంద్ర జడేజాను విమర్శిస్తూ పలు కామెంట్లు చేశారు. ఆ తర్వాత జడేజా కూడా ఘాటుగా రిప్లై ఇవ్వడం తీవ్ర చర్చకు దారి తీసింది. భారత ఆటగాళ్లపై సంజయ్ మంజ్రేకర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ ఒకానొక సమయంలో సంజయ్ మంజ్రేకర్ ను కామెంట్రీ ప్యానెల్ నుండి పక్కన పెట్టేశారు. సంజయ్ జడేజా ను ఉద్దేశించి చేసిన 'బిట్స్ అండ్ పీసెస్' ఆల్ రౌండర్ అనే వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆల్ రౌండర్ జడేజా సంజయ్ పై సోషల్ మీడియాలో పోస్ట్‌ కూడా పెట్టాడు. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ 2022లో తమ మొదటి గ్రూప్ A మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా రాణించడంతో భారత్ ఐదు వికెట్ల తేడాతో పాక్ ను ఓడించింది.



Tags:    

Similar News