తాడేపల్లిగూడెంలో జనసేన కాపు నేతల భేటి

తాడేపల్లిగూడెంలో జనసేన కాపు నేతల సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

Update: 2022-11-02 07:22 GMT

తాడేపల్లిగూడెంలో జనసేన కాపు నేతల సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఇటీవల రాజమండ్రిలో వైసీపీ కాపు నేతల సమవేశం జరిగిన సంగతి తెలిసిందే. దానికి కౌంటర్ గా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి రాష్ట్రం నలమూలల నుంచి జనసేన కాపు నేతలు ఇప్పటికే తాడేపల్లిగూడెంకు చేరుకున్నారు. సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమయింది.

ప్రభుత్వ విధానాలపై...
అయితే ఈ సమావేశంలో ఇందులో ప్రధానంగా పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు, కాపు సామాజికవర్గం ప్రయోజనాల కోసం ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి? కాపు రిజర్వేషన్ల అంశం, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అనుసరించాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.


Tags:    

Similar News