ప్రభాస్ ఫ్యాన్స్ అతి.. థియేటర్ లో ప్రమాదం

ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు తాడేపల్లి గూడెంలోని ఒక ధియేటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది

Update: 2022-10-23 07:28 GMT

ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు తాడేపల్లి గూడెంలోని ఒక ధియేటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు తాడేపల్లి గూడెంలోని వెంకట్రామ థియేటర్ లో బిల్లా సినిమాను ప్రదర్శించారు. అయితే ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులు థియేటర్లోనే బాణసంచాను పేల్చారు. దీంతో థియేటర్ మొత్తం పొగ వ్యాపించింది. సీట్లు కాలిపోయాయి.

సీట్లకు మంటలు అంటుకుని....
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహానిజరగలేదు. అయితే దీనిపై థియేటర్ యాజమాన్యం సీరియస్ అయింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News