ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ ఈరోజు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. పాదయాత్ర కు విరామమిచ్చి ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. నాంపల్లి కోర్టులో జగన్ కేసుల విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు నిమ్మగడ్డ ప్రసాద్, సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర చేస్తన్నారు. కోర్టు విచారణ అనంతరం ఆయన తిరిగి గుంటూరు జిల్లాకు బయలుదేరి వెళతారు.