తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను కోరింది. శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేల బృందం స్పీకర్ ను అసెంబ్లీ ఆవరణలో కలుసుకుని ఈ మేరకు పిటిషన్ సమర్పించింది. తమ పార్టీ నుంచి గెలిచిన భూమా అఖిల ప్రియ, భూమా నాగిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, జలీల్ ఖాన్, జయరాములు, కలమట వెంకటరమణ, మణిగాంధీ, డేవిడ్ రాజు అనంతరం టీడీపీలో చేరడం అప్రజాస్వామికమని వారు పేర్కొన్నారు. తక్షణం వీరిని అనర్హులుగా ప్రకటించాలని వారు స్పీకర్ ను కోరారు. శాసనసభలో వైఎస్సార్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యేల బృందానికి నాయకత్వం వహించారు.