విశాఖకు..పవన్ ...ఎందుకంటే...?

Update: 2017-12-05 11:40 GMT

పవన్ మళ్లీ ప్రజల్లోకి వస్తున్నాడు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ ప్రజాసమస్యలపై కూడా దృష్టి పెడుతున్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ను ప్రయివేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ సంస్థ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. మరో వైపు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థను ప్రయివేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగి వెంకటేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్ కుటుంబం విజయనగరం జిల్లాకు చెందినది. ఆ కుటుంబాన్ని పవన్ కల్యాణ్ పరామర్శించే అవకాశం ఉంది. అలాగే డీసీఐ ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో పవన్ పాల్గొననున్నారు.

Similar News