విశాఖ వన్డే : వెస్టిండీస్ గెలవాలంటే...?

Update: 2018-10-24 11:56 GMT

విశాఖలో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ భారీ టార్గెట్ ను వెస్టిండీస్ ముందుంచింది. విరాట్ కొహ్లి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 157 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. మొత్తం యాభై ఓవర్లలో భారత్ 321 పరుగులు చేసింది. అయితే వెస్ట్ ఇండీస్ గెలవాలంటే 322 పరుగులు చేయాల్సి ఉంటుంది. 46 వ ఓవర్లో కొహ్లి రెండు సూపర్ సిక్స్ లు బాది తన సత్తా చాటాడు. 47వ ఓవర్ లోనూ మరో సిక్స్ బాదాడు. వరుసగా ఆరు వికెట్లు పడినా విరాట్ క్రీజులోనే నిలదొక్కుకుని భారత్ కు భారీ స్కోరు సాధించాడు. మొత్తం ఐదు వికెట్ల కోల్పోయి భారత్ యాభై ఓవర్లలో 321 పరుగులు చేసింది. అంబటి రాయుడు 73 పరుగులు చేశారు.

Similar News