వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పై టీడీపీ నేతల యుద్ధం ఆపలేదు. తాజాగా ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి విజయసాయిరెడ్డిపై ఫైరయ్యారు. విజయసాయి రెడ్డి పార్లమెంటు సభ్యుడా? శునకమా? అని ప్రశ్నించారు. చంద్రబాబును అంత మాట అంటారా? ఇంకొకరైతే చెంప చెళ్లుమనిపించేవారని కేఈ వ్యాఖ్యానించారు. బీజేపీ, పవన్, జగన్ లు కుమ్మక్కై రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తున్నారని కేఈ విమర్శించారు.