రైల్లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు విజయవాడ రైల్వే పోలీసులకు దొరికిపోయారు. నెల్లూరు నుంచి కేరళ ఎక్స్ప్రెస్లో రెండు కేజీల బంగారాన్ని విజయవాడ మీదుగా జగ్గయ్యపేట తరలించేందుకు నితీష్ ఖత్రీ., నందకిషోర్ ఖత్రీ ఏర్పాటు చేసుకున్నారు. కేరళ ఎక్స్ప్రెస్లో విజయవాడ చేరుకున్న వీరిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయడంతో ఆభరణాలు బయటపడ్డాయి. వీటికి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పదో నంబర్ ప్లాట్ఫాం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయారు..