రైలులో హిజ్రాలు ఏం చేశారంటే...!

Update: 2018-02-05 13:42 GMT

డబ్బులు ఇవ్వలేదని వ్యక్తిని కడతేర్చారు హిజ్రాలు. రైలులో ప్రయాణికులపై హిజ్రాల కిరాతకం హెచ్చుమీరుతోంది. డబ్బులు ఇవ్వకపోతే దాడికి దిగుతున్నారు. హిజ్రాల దాడిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయవాడ ప్రాంతానికి చెందిన గాలం సత్యనారాయణ (30), మిత్రులు కారం వీరబాబు (20), పాపన్నదొర (20), గాలం స్వామిదొర (24) తిరుప్పూరులోని బనియను పరిశ్రమలో పని చేసేందుకు జంషెడ్ పూరు ఆలప్పుజ వెళ్తున్న బొకారొ ఎక్స్‌ప్రెస్‌ రైలులో వెళ్తున్నారు. కృష్ణగిరి జిల్లా ఉత్తంగరై సమీపంలోని సామల్‌పట్టి రైల్వేస్టేషన్‌ వద్ద రైలు ఆగింది. కొన్ని నిమిషాల తర్వాత రైలు కదిలింది. తలుపు దగ్గర సత్యనారాయణ, వీరబాబు ఉన్నప్పుడు హిజ్రాల బృందం డబ్బులు డిమాండ్‌ చేసింది. డబ్బులు లేవని చెప్పడంతో వారిపై దాడికి దిగారు. కదులుతున్న రైలు నుంచి సత్యనారాయణను కిందకు తోసేయడంతో తీవ్ర రక్తస్రావంతో సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. రక్షించడానికి యత్నించిన వీరబాబు రైలు నుంచి కిందపడి గాయపడ్డాడు. ప్రయాణికులు భయాందోళనకు గురై రైలు ఆపడంతో హిజ్రాల బృందం పరారైంది. సామల్‌పట్టి, ఊత్తంగరై రైల్వేస్టేషన్లకు సమాచారం అందించారు.

Similar News