బ్రేకింగ్ : బీజేపీకి షాక్... ప్రచారంలో గుండెపోటుతో ఎమ్మెల్యే మృతి

Update: 2018-05-04 03:53 GMT

కర్ణాటక ఎన్నికల ప్రచారం సమయంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విజయకుమార్ మృతి చెందారు. ప్రచారం నిర్వహిస్తుండగానే కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందారు. బీజేపీ తరుపున అభ్యర్థిగా జయానగర్ నుంచి విజయకుమార్ పోటీ చేస్తున్నారు. ఈరోజు ఉదయం ఎన్నికల ప్రచారం సమయంలో ఒక ఇంటికి వెళ్లి ఓట్లు అడుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవలే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విజయకుమార్ ఆసుపత్రిలో చేరి చికిత్స కూడా పొందారు. ప్రచారానికి వెళ్లొద్దని వారించినా వినకుండా వెళ్లారని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. విజయకుమార్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఎన్నికల మేనిఫేస్టోను విడుదల చేస్తామని బీజేపీ ప్రకటించింది. జయానగర్ సీటు విజయంపై ఎంతో నమ్మకం పెట్టుకున్న బీజేపీకి విజయ్ కుమార్ మరణంతో షాక్ కు గురయింది.

Similar News