బెజవాడలో వైసీపీ కార్యాలయం ఇక్కడే

Update: 2017-07-28 09:05 GMT

ఎట్టకేలకు బెజవాడలో వైసీపీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. బందరు రోడ్ లో ఉన్న మాజీ మంత్రి కొలుసు పార్థ సారధికి చెందిన విశాలమైన స్థలంలో పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టారు. ప్రీ ఫాబ్రికేటెడ్ పద్దతిలో వీలైనంత త్వరగా భవనాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. రెండు నెలల వ్యవధిలో ఈ నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం ఉంది. పార్టీ కార్యాలయం తో పాటు భారీగా వాహనాలు నిలుపుకోడానికి., సమావేశాలు నిర్వహించుకోడానికి ఈ ప్రాంగణం వీలుగా ఉంటుంది. భూమి పూజ కార్య క్రమంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి., మల్లాది విష్ణు., వంగవీటి రాధ., సారధి తదితరులు పాల్గొన్నారు.

Similar News